సాయి పల్లవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు డ్యాన్స్ను చూసి తాను డ్యాన్సర్ కావాలని నిర్ణయించుకున్నానని వెల్లడించారు. ఆమె మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డ్యాన్స్తో ఫిదా
సాయి పల్లవి మాట్లాడుతూ, “నేను చిన్నప్పుడు చిరంజీవి నటించిన ‘ముఠామేస్త్రి’ సినిమాను తెగ చూసేదాన్ని. ఆయన డ్యాన్స్కి ఫిదా అయ్యాను. అప్పట్నుంచే డ్యాన్సర్ అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఆ ఆసక్తితోనే వివిధ డ్యాన్స్ షోలలో పాల్గొన్నాను” అని చెప్పుకొచ్చారు.
చిరంజీవితో డ్యాన్స్
అంతేకాదు, ఒక ఈవెంట్లో చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేయడం తన జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకం అని సాయి పల్లవి పేర్కొన్నారు. ఇటీవల ‘తండేల్’ మూవీతో తెలుగులో మంచి హిట్ అందుకున్న సాయి పల్లవి, టాలీవుడ్లో ఇప్పటికే ‘ఫిదా’, ‘ఎంసీఏ’, ‘లవ్స్టోరీ’, ‘శ్యామ్సింగరాయ్’ వంటి హిట్ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ప్రస్తుతం ఆమె బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ సరసన ‘రామాయణ’లో సీతగా నటిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆమె కెరీర్కు మరో మైలురాయిగా మారనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

సాయి పల్లవి గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామతన ఫస్ట్ సినిమాతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాత తెలుగులో ‘ఫిదా’ మూవీలో నటించి ఆడియన్ను ఫిదా చేసింది. అయితే సినిమాల్లో మేకప్ వేసుకోకపోవడం, గ్లామర్ ట్రీట్ ఇవ్వకపోవడం వంటి విషయాలతో ఈ ముద్దుగుమ్మ మరింత ఫేమ్ అయింది. ఇక ఈ భామ డ్యాన్స్ కి అయితే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి.చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘తండేల్’ సినిమాలో హీరోయిన్ గా నటించి అలరించింది. తన యాక్టింగ్తో ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.అంతేకాకుండా నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలిచింది.