ఆంధ్రప్రదేశ్లోని మద్యం కొనుగోలు, సరఫరా వ్యవస్థలో జరిగిన భారీ అవినీతికి సంబంధించిన లిక్కర్ స్కామ్ కేసులో మరో కీలకమైన మలుపు తిరిగింది. సిట్ అధికారులు ఈ కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్రెడ్డిని నిన్న (శుక్రవారం) సాయంత్రం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసిన అనంతరం ఆయనను విజయవాడకు తరలించి, ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరు పరిచే చర్యలు తీసుకుంటున్నారు.
ప్రధాన నిందితుడి అరెస్ట్ – కేసిరెడ్డి రిమాండ్లోకి
ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డిని పోలీసులు గతవారం అరెస్ట్ చేశారు. కేసులో సేకరించిన ఆధారాలను కోర్టులో సమర్పించిన అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలు జారీ చేయగా, కేసిరెడ్డిని విజయవాడ జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. సిట్ అధికారులు ఇప్పటికే రూ.3,200 కోట్లకు పైగా మద్యం సంబంధిత అవినీతిని గుర్తించి, సంబంధిత డాక్యుమెంటేషన్ ఆధారాలు సేకరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో కొన్ని ప్రముఖ మద్యం కంపెనీలు, మధ్యవర్తులు, అధికారులు కలిసి మద్యం కొనుగోలు, పంపిణీ వ్యవస్థలో మోసాలు జరిపినట్లు అధికారులు వెల్లడించారు. మద్యం టెండర్లలో అక్రమంగా లాభాలు పొందేందుకు ఒప్పందాలు చేసుకున్నట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
CBI దర్యాప్తు
ఈ అంశం ఇప్పటికే రాజకీయంగా వేడెక్కిన నేపథ్యంలో, టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఇటీవలే లోక్సభలో ఈ స్కామ్ను ప్రస్తావించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసి CBI దర్యాప్తు కోరారు. దీంతో కేసుపై మరింత దృష్టి కేంద్రీకరించి, సీఐడీ విచారణ వేగవంతం చేసింది. వాస్తవానికి, ఈ కేసులో ఇంకా పలువురు కీలక వ్యక్తుల పాత్రపై అనుమానాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఐడీ దర్యాప్తును వేగవంతం చేసింది. నిందితుల అరెస్టుపై దృష్టి సారించింది.
Read also: Murder: విశాఖలో ఘోరం.. వృద్ధ దంపతుల దారుణ హత్య