PV Sindhu Bhoomi Puja for Badminton Academy in Visakha

విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి భూమిపూజ చేసిన పీవీ సింధు

విశాఖపట్నం: విశాఖపట్నంలోని పెద గదిలి కూడలి సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన స్థలంలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మాణానికి ఒలింపిక్ ప‌త‌క విజేత‌, భార‌త స్టార్ బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధు తన తల్లిదండ్రులతో కలిసి భూమిపూజ చేశారు. ఇక్కడ సుమారు మూడెకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఆమెకు కేటాయించింది.

అనంతరం పీవీ సింధు మాట్లాడుతూ..పనులు త్వరగా చేపట్టి ఏడాదిలోగా నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అకాడమీ సామర్థ్యం, శిక్షణ తదితర వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. బ్యాడ్మింటన్‌పై ఆసక్తి ఉన్న చిన్నారులు, యువతను ఉన్నత స్థాయి పోటీల్లో ప్రతిభ చూపేలా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పీవీ సింధు అన్నారు. త‌న‌కు ప్ర‌భుత్వం నుంచి పూర్తి స‌హాయ స‌హ‌కారాలు ఉన్నాయ‌ని, అకాడ‌మీ నిర్మాణానికి అన్ని అనుమ‌తులు వ‌చ్చాయ‌ని తెలిపారు. వైజాగ్‌లో బ్యాడ్మింట‌న్ నేర్చుకునే క్రీడాకారుల పొటెన్షియాలిటీ చాలా ఎక్కువ‌ని ప్ర‌శంసించారు. ప్ర‌భుత్వ స‌హకారంతో బ్యాడ్మింట‌న్‌పై ఆస‌క్తి ఉన్న యువ‌తీ, యువ‌కుల‌కు అద్భుత‌మైన శిక్ష‌ణ ఇస్తామ‌ని సింధు తెలిపారు. త‌ద్వారా మెరిక‌ల్లాంటి ఆట‌గాళ్ల‌ను త‌యారు చేసి, అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై మెడ‌ల్స్ గెలిచేలా త‌యారు చేస్తామ‌ని అన్నారు.

Related Posts
నేడు సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ
Deputy CM Pawan Kalyan meet CM Chandrababu today

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఈరోజు (సోమవారం) మధ్యాహ్నం ఒంటి గంటకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు, పలు ఇతర Read more

17న మహాకుంభ మేళాకు లోకేశ్
Minister Nara Lokesh visit to America has ended

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనాల్లో ఒకటైన మహాకుంభమేళా.17న మహాకుంభ మేళాకు లోకేశ్.ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబంతో కలిసి ఈ నెల 17న ప్రయాగ్ మహాకుంభమేళాకు Read more

మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?
మన్మోహన్ సింగ్ స్మారక స్థలం ఎక్కడ?

కేంద్రం, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ స్మారకాన్ని నిర్మించడానికి సంబంధించి ప్రతిపాదిత స్థలాలను, ఎంపికలను ఆయన కుటుంబ సభ్యులకు పంపాలని సూచించింది. రాజ్‌ఘాట్, రాష్ట్రీయ స్మృతి Read more

సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్
సీఈసీగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్

1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేష్ కుమార్ భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జ్ఞానేష్ కుమార్ ను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *