PSLV C-60 rocket launch successful..

PSLV C-60 రాకెట్ ప్రయోగం విజయవంతం..

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ISRO) చేపట్టిన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ సీ – 60 (PSLV C-60) వాహకనౌక ప్రయోగ వేదిక నుంచి సరిగ్గా రాత్రి 10 గంటల 15 సెకన్లకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. టార్గెట్, ఛేజర్ ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా స్పేడెక్స్ ప్రయోగం చేపట్టారు. స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు చేపట్టారు. పీఎస్ఎల్వీ ద్వారా ప్రయోగించిన 2 చిన్న వ్యోమ నౌకలను అంతరిక్షంలోనే ఒకదానితో ఒకటి డాకింగ్ చేయించడం ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. ఈ 2 ఉపగ్రహాల బరువు 440 కిలోలు ఉంటుందని ఇస్రో తెలిపింది.

Advertisements

ఈ ప్రయోగంలో భాగంగా ఇస్రో మరో 24 పేలోడ్‌లను సైతం అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. వీటిల్లో 14 ఇస్రో, డీఓఎస్‌కు చెందినవి కాగా, 10 పేలోడ్లు ప్రభుత్వేతర సంస్థవి. కాగా, సోమవారం రాత్రి 9.58 గంటలకు ప్రయోగం ప్రారంభించాల్సి ఉన్నా అంతరిక్షంలో ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా ప్రయోగం రెండు నిమిషాలు ఆలస్యమై 10 గంటల 15 సెకన్లకు ప్రారంభమైంది. ఇస్రోకు ఇది 99వ ప్రయోగం. పీఎస్‌ఎల్వీ-సీ60 ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చీఫ్‌ సోమనాథ్‌ ప్రకటించారు. ఉపగ్రహాలను వాహకనౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశపెట్టిందని తెలిపారు. డాకింగ్‌ ప్రక్రియకు మరో వారం రోజులు పడుతుందని చెప్పారు. ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు.

ఇస్రో చేపట్టబోతున్న భవిష్యత్‌ ప్రయోగాలకు డాకింగ్‌ సామర్థ్యం అత్యంత కీలకం. చంద్రుడి పైకి వ్యోమగాములను పంపడానికి, చంద్రుడి ఉపరితలం నుంచి మట్టి నమూనాలను భూమి పైకి తీసుకురావడానికి డాకింగ్‌ సామర్థ్యం అవసరం. భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ అంతరిక్ష కేంద్రం(బీఏఎస్‌) ఏర్పాటుకు, అంతరిక్షానికి భారత్‌ నుంచి మొదటి వ్యోమగామిని పంపించడానికి చేపట్టనున్న గగన్‌యాన్‌ ప్రయోగానికి సైతం డాకింగ్‌ అవసరం. స్పేడెక్స్‌ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్ష ప్రయోగాల్లో డాకింగ్‌ సామర్థ్యం ఉన్న నాలుగో దేశంగా భారత్‌ నిలుస్తుంది. ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనాకు మాత్రమే ఈ సామర్థ్యం ఉంది.

Related Posts
Indians : యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది ?
Indians యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది

Indians : యూఏఈ క్షమాభిక్ష వెనుక ఉద్దేశం ఏముంది ? పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ Read more

ఎంఎస్‌ఈలు, స్టార్టప్‌‌లకు రూ.20 కోట్ల వరకు రుణాలు..

న్యూఢిల్లీ: ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను ఎన్డీయే సర్కార్‌ పార్లమెంటులో ప్రవేశ‌పెట్టారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో బ‌డ్జెట్‌ను చ‌ద‌వి వినిపిస్తున్నారు. Read more

Bandi Sanjay : టీటీడీ చైర్మన్‌‌కు బండి సంజయ్ లేఖ
Bandi Sanjay letter to TTD Chairman

Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడుకు లేఖ రాశారు. దేశవ్యాప్తంగా ధర్మ ప్రచారంతో పాటు హిందూ దేవాలయాల Read more

వైఎస్ షర్మిలతో, విజయసాయిరెడ్డి భేటీ?
వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి భేటీ

రాజకీయాల్లోకి దూరంగా వెళ్ళిపోతున్నట్లు ప్రకటించి సంచలనం రేపిన విజయసాయిరెడ్డి, ఇప్పుడు మరొక కొత్త సంచలనం సృష్టించారు. మూడు రోజుల క్రితం, ఆయన హైదరాబాద్‌లోని వైఎస్ షర్మిల నివాసానికి Read more

Advertisements
×