Protests of BC communities on 18th of this month..R. Krishnaiah

18న బీసీ సంఘాల నిరసనలు: ఆర్. కృష్ణయ్య

42% రిజర్వేషన్లకు కచ్చితంగా చట్టబద్ధత కల్పించాల్సిందే..

హైదరాబాద్‌: కులగణన సర్వే మళ్లీ జరపాలని, స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని, ఆ తర్వాతే ఎన్నికలు జరపాలనే డిమాండ్‌ తో ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను బీసీలు ముట్టడించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్లు, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాలను ముట్టడించి, ధర్నాలు, నిరసన దీక్షలు చేపట్టాలని కోరారు.

image

హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ నీల వెంకటేశ్‌ అధ్యక్షతన జరిగిన బీసీ నేతల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చిన ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లను చట్టపరంగా కల్పించాలి తప్ప, పార్టీపరంగా ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. పార్టీ పరంగా ఇచ్చేందుకు మేమేమైనా బిచ్చగాళ్లమా? అని నిలదీశారు. ‘రాజ్యాంగం ప్రకారం మా వాటా మాకిచ్చి తీరాల్సిదే.. లేకుంటే రాష్ర్టాన్ని అగ్నిగుండం చేస్తామని హెచ్చరించారు.

బీసీ భవన్‌లో 14 బీసీ సంఘాలు 30 కులసంఘాలతో కలిసి రిజర్వేషన్లపై చర్చించామని తెలిపారు. గత సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూ పి రిజర్వేషన్లకు మొండిచేయి చూపుతామంటే సహించబోమని స్పష్టంచేశారు. వెంటనే సీఎం అఖిలపక్షం స మావేశాన్ని ఏర్పాటుచేసి అన్ని పార్టీల నిర్ణయాలను తెలుసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. బీసీలకు అన్యా యం తలపెడితే కాంగ్రెస్‌ ప్రభుత్వం అంతుచూస్తామని తీవ్ర స్థాయిలో హె చ్చరించారు. బీసీ నేతలు వేముల రా మకృష్ణ, గొరిగే మల్లేశ్‌, నందగోపాల్‌, బీసీ మహిళా నేత కీర్తిలతాగౌడ్‌, మోడీ రామ్‌దేవ్‌, శివ, రవియాదవ్‌, జయంతిగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Related Posts
Komatireddy Venkat Reddy: హరీశ్ రావు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy: హరీశ్ రావు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన కోమటిరెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో రహదారుల నిర్మాణంపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానంలో Read more

గ్రూప్-1 అభ్యర్థుల ఆందోళన.. లాఠీఛార్జ్ చేసిన పోలీసులు
group1 cand

హైదరాబాద్ అశోక్ నగర్లో గ్రూప్-1 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మెయిన్స్ రీషెడ్యూల్ చేయాలని వారు నిరసనకు దిగగా, పలువురు అభ్యర్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో గాయాలయ్యాయి.ఇక 16 Read more

Vijay Sai Reddy : కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో విజయసాయిపై సీఐడీ నోటీసులు
Vijay Sai Reddy కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో విజయసాయిపై సీఐడీ నోటీసులు

Vijay Sai Reddy : కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో విజయసాయిపై సీఐడీ నోటీసులు కాకినాడ సీ పోర్ట్, సెజ్ భూముల అక్రమ బదిలీ కేసులో మాజీ Read more

మాట్ గేట్జ్ వివాదం తరువాత, పామ్ బోండి ని అటార్నీ జనరల్ గా ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్
pam bondi

డొనాల్డ్ ట్రంప్, తన అటార్నీ జనరల్ పథవికి ఫ్లోరిడా రాష్ట్ర మాజీ అటార్నీ జనరల్ పామ్ బోండి ని నియమించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రకటనను, మాజీ Read more