దేవాదాయ అధికారులకు హైకోర్టు ఆదేశం
Vijayawada: బుగ్గ మఠానికి చెందిన 3.88 ఎకరాల భూమిని ఆక్రమించిన వ్యవహారంలో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి (Peddireddy) రామచంద్రారెడ్డి పై తాజాగా విచారణ జరపాలని దేవాదాయశాఖ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. బుగ్గమఠానికి చెందిన 3.88 ఎకరా భూమిని ఖాళీ చేయాలని, అందులో నిర్మాణాలను తొలగించాలంటూ మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులపై అభ్యంతరం ఉంటే దేవాదాయ ట్రైబ్యునల్ను ఆశ్రయించాలని ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి గతంలో ఉత్తర్వులిచ్చారు. ఈ ఉత్తర్వులను సవాలుచేస్తూ పెద్దిరెడ్డి (Peddireddy) ధర్మా సనం ముందు అప్పీల్ వేశారు. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది సీవీ మోహన్రెడ్డి వాద నలు వినిపించారు. తమ వాదనలు వినకుండా, కోరిన దస్త్రాలు ఇవ్వకుండా మఠం ఈవో ఉత్తర్వులిచ్చారన్నారు. వాటిని రద్దు చేయాలని కోరారు. రాష్ట్రప్రభుత్వం, మఠం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ (Dammalapati Srinivas) వాదనలు వినిపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy) మఠం భూములను ఆక్రమించారన్నారు. 3.88 ఎకరాల విషయంలో ఆయన వద్ద ఎలాంటి దస్త్రాలు లేవన్నారు. మఠం వద్ద ఉన్న దస్త్రాలను మీరే ఇవ్వండి అంటూ వ్యవహారాన్ని సంక్లిష్టం చేస్తున్నారన్నారు.

అధికారులపై ఆరోపణలు నిరాధారమన్న వాదనలు
అధికారులపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారన్నారు. దస్త్రాలు ఇచ్చేందుకు అభ్యంతరం లేదన్నారు. తిరుపతి పట్టణం, ఎంఆర్ పల్లి పరిధి సర్వే నంబరు 261/1లో 1.50 ఎకరాలు, 261/2లో 2.38 ఎకరాల(మొత్తం 3.88)కు సంబంధించిన దస్త్రాలను వారం రోజుల్లో పెద్దిరెడ్డికి ఇవ్వాలని, తర్వాత వివరణ తీసుకోని మొత్తం నాలుగు వారాల్లో విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేసింది. అందుకు ముందు విచారణ జరిపిన మఠం ఈవో/అసిస్టెంట్ కమిషనర్ తో కాకుండా మరో అధికారితో విచారణ జరిపించాలని పెద్దిరెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది అభ్యర్థిస్తున్న నేప థ్యంలో మరో అధికారితో విచారణ జరిపించాలని ఆదేశించింది. 3.88 ఎకరాలను ఖాళీచేయా లంటూ మఠం ఈవో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసింది. తాజాగా విచారణ జరిపాక ప్రతికూల ప్రభావం చూపేలా ఉత్తర్వులుంటే వాటిపై పెద్దిరెడ్డి అప్పీల్ వేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. ఆ ఉత్తర్వుల ఆధారంగా మూడు వారాలపాటు చర్యలు తీసుకోవద్దని అధికారులను ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్, జస్టిస్ చీమల పాటి రవితో కూడిన ధర్మాసనం ఈమేరకు ఉత్తర్వులిచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: Tirumala: తిరుపతి లో తొక్కిసలాట ఘటనపై నేడే నివేదిక