Pawan Kalyan : పవన్ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తాడని అంటూ : నాగవంశీ టాలీవుడ్లో స్టార్ హీరోగా అందరి మన్ననలు పొందిన పవన్ కల్యాణ్ రాజకీయాల్లో అడుగుపెట్టి తాజాగా ఉప ముఖ్యమంత్రి (డిప్యూటీ సీఎం) పదవిని చేపట్టారు.ఒకపక్క సినిమాలు మరోపక్క రాజకీయాలతో ఆయన గతంలో బిజీగా గడిపినా,ఇప్పుడు ప్రభుత్వ బాధ్యతలు పెరగడంతో సినిమాలకు సమయం దొరకడం కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో పవన్ భవిష్యత్తు సినిమా ప్రాజెక్టులపై అనేక సందేహాలు మొదలయ్యాయి.ఆయన ఇంకా సినిమాలు చేస్తారా లేక పూర్తిగా రాజకీయాలకే అంకితమవుతారా అనే ప్రశ్నలు మెగాఫ్యాన్స్తో పాటు సినీ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.పవన్ కల్యాణ్ సినిమా భవిష్యత్తుపై తాజాగా నిర్మాత నాగవంశీ స్పందించారు.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా ప్రమోషన్ ఈవెంట్లో ఆయన పవన్ సినీ కెరీర్పై కీలక వ్యాఖ్యలు చేశారు.పవన్ గారు సినిమాలు చేయాలని కోరుకోవడం కంటే,ఆయన ఈ రాష్ట్రానికి, దేశానికి ఏం చేస్తారని ఆశించాలి అని నాగవంశీ అన్నారు.ఆయన మరింత ఉన్నత స్థాయికి ఎదిగి,ప్రజలకు మంచి చేయాలని కోరుకోవాలి అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

పవన్ చేతిలో ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి
హరిహర వీరమల్లు – ఈ సినిమా మే 9, 2025 న విడుదల కానుంది.
ఓజీ – ఇప్పటికే 80% షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ – కొన్ని ముఖ్యమైన షెడ్యూల్లు మిగిలి ఉన్నాయి.
అయితే, పవన్ కొత్త సినిమాలను అంగీకరిస్తారా? లేక ప్రస్తుత సినిమాల తర్వాత పూర్తిగా రాజకీయాలకే వెళ్లిపోతారా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
మెగాభిమానుల నిరీక్షణకు ఎండింగ్ ఉందా
పవన్ రాజకీయాల్లో ఉన్నా ఆయన సినిమాల కోసం అభిమానులు ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటారు. పవన్ నటన, ఆయన స్ఫూర్తిదాయక పాత్రలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తాయి. కానీ ఇప్పుడు రాజకీయాల్లో ఆయన క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు.ఈ పరిస్థితుల్లో పవన్ భవిష్యత్తు సినిమాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.ఆయన పూర్తి స్థాయిలో రాజకీయాలకే అంకితమయ్యారా లేక సినిమాలకు కూడా సమయం కేటాయిస్తారా? అనేది అతి త్వరలోనే తెలుస్తుంది.నాగవంశీ వ్యాఖ్యల తర్వాత పవన్ సినీ కెరీర్ ముగిసిందా? అనే సందేహాలు ఏర్పడ్డా, ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కానీ పవన్ అభిమానులు మాత్రం ఆయన మరిన్ని సినిమాలు చేయాలని ఆశిస్తున్నారు.