పాకిస్తాన్పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. ఆపరేషన్ సింధూర్ మిషన్ చేపట్టింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులకు దిగింది. శతృదేశానికి ఊపిరి సలపనివ్వకుండా ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం.
ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం
తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించింది. బహవాల్పూర్ అహ్మద్పూర్ ఈస్ట్లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి. ముజఫ్ఫరాబాద్లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు, సియాల్కోట్లో మురిడ్కె, కోట్కి, షక్కర్ఘర్లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన రెండు క్యాంపులు ధ్వంసం అయ్యాయి.

సరిహద్దు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు
ఈ పరిణామాలతో భారత్- పాకిస్తాన్ సరిహద్దు మొత్తం కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భీకరంగా తయారయ్యాయి. రెండు దేశాలు కూడా సైన్యాన్ని సరిహద్దులకు తరలించాయి. జమ్మూ కాశ్మీర్లో నియంత్రణ రేఖ వెంబడి ఈ దాడులు చోటు చేసుకున్నాయి. భారత్ వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికే సాధారణ పౌరులపై ఇలా మోర్టార్ షెల్స్తో ప్రతీకారానికి పాల్పడింది పాక్. మన్కోఠ్, జమ్మూ సెక్టార్ రాజౌరి జిల్లాలోని లామ్, మన్జా కోఠ్, కాశ్మీర్ సెక్టార్ కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, తంగ్ధర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసితులపై భారీ షెల్లింగ్ దాడులు సాగించింది పాకిస్తాన్ ఆర్మీ.
Read Also: Masood Azhar: ఆపరేషన్ సింధూర్.. మసూద్ అజార్ కుటుంబ సభ్యులు 10 మంది మృతి