हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

త్రిభాషా సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు: స్టాలిన్‌

Vanipushpa
త్రిభాషా సిద్ధాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు: స్టాలిన్‌

త్రిభాషా సిద్ధాంతంపై తమిళనాడు సీఎం స్టాలిన్‌ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదన్నారు. నాగ్‌పూర్‌ నుంచి వచ్చే ఆదేశాలను తమిళనాడులో అమలు చేయబోమని ప్రకటించారు. కొత్త విద్యా విధానం పేరుతో హిందీని తమపై బలవంతంగా రుద్దేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేసిందన్నారు. పార్లమెంట్‌లో త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు వీరోచితంగా పోరాడుతున్నారని స్టాలిన్‌ అభినందించారు. కేంద్రం బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదన్నారు. తమిళనాడు ఎంపీలపై కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, చేసిన వ్యాఖ్యలను స్టాలిన్‌ తీవ్రంగా ఖండించారు.

త్రిభాషా సిద్దాంతాన్ని అమలు చేసే ప్రసక్తే లేదు: స్టాలిన్‌


పార్లమెంట్‌ ఆవరణలో డీఎంకే ఎంపీలు ఆందోళన
మరోవైపు త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకంగా డీఎంకే ఎంపీలు పార్లమెంట్‌ ఆవరణలో ఆందోళన చేపట్టారు. తమిళనాడును అవమానించిన కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. నల్లదుస్తులు ధరించి డీఎంకే ఎంపీలు ఆందోళన చేశారు. అయితే డీఎంకే ఎంపీల తీరును తీవ్రంగా తప్పుపట్టారు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌. డీఎంకేలో అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయని, అందుకే ఈవిషయం నుంచి దృష్టి మరల్చడానికి త్రిభాషా వ్యతిరేక ఉద్యమానికి తెరపైకి తెచ్చారని విమర్శించారు. కొత్త విద్యా విధానంపై డీఎంకే మాట మార్చిందని , ఆ పార్టీ ఎంపీలు అనాగరికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ధర్మేంద్ర ప్రధాన్‌ వ్యాఖ్యలకు డీఎంకే ఎంపీలు లోక్‌సభలో తీవ్ర నిరసన తెలిపారు . తాము ముమ్మాటికి త్రిభాషా సిద్దాంతానికి వ్యతిరేకమన్నారు ఎంపీ కనిమొళి.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870