हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించవద్దు: సుప్రీం ఆదేశం

Vanipushpa
అటవీ విస్తీర్ణాన్ని తగ్గించవద్దు: సుప్రీం ఆదేశం

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ పని చేయొద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏ చర్యలనైనా నిషేధిస్తున్నట్లు పేర్కొంది. అటవీ (సంరక్షణ) సవరణ చట్టం, 2023ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. కేంద్ర ప్రభుత్వం అటవీ (సంరక్షణ) చట్టంలో చేసిన సవరణల కారణంగా 1.97 లక్షల చదరపు కిలోమీటర్ల భూమి అటవీ ప్రాంతం నుండి మినహాయించబడిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఏదైనా ముఖ్యమైన పనికి అటవీ భూమిని ఉపయోగించాల్సి వస్తే, చెట్లను నాటడానికి ఇతర భూమిని అందించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

అటవీ విస్తీర్ణాన్ని తగ్గించే ఏదీ అనుమతించబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ‘తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు, అటవీ భూమి తగ్గింపుకు దారితీసే ఎటువంటి చర్యను భారత ప్రభుత్వం లేదా ఏ రాష్ట్రం తీసుకోకూడదని ఆదేశిస్తున్నాము’ అని ధర్మాసనం పేర్కొంది. సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్, న్యాయవాది కౌశిక్ చౌదరి వాదనలు వినిపిస్తూ.. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ చెట్ల సంఖ్యను పెంచడానికి ఒక చట్టబద్ధమైన యంత్రాంగాన్ని రూపొందించిందని, అయితే అది భారతదేశ అటవీ విస్తీర్ణానికి చాలా హానికరం అని అన్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870