మధ్యప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిమాణాలు దేశం మొత్తాన్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా అక్కడి పోలీసులు.. బిచ్చం అడుగుతున్న ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. భోపాల్లో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర అతను వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తూ.. బిచ్చం అడుగుతున్నాడు. ఇది గమనించిన ఓ పౌరుడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. దాంతో.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. ఆ బిచ్చం ఎత్తుకునే వ్యక్తిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. మధ్యప్రదేశ్ పోలీసులు ఇంతలా కఠినంగా వ్యవహరించడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యే భిక్షాటన నిరోధక చట్టం తెచ్చింది. దీని ప్రకారం.. ఎవరైనా బిచ్చం అడగడం, బిచ్చం వెయ్యడం రెండూ నేరమే. ఈమధ్య అదే మధ్యప్రదేశ్ ఇండోర్లో ఓ గుడి ముందు అడుక్కుంటున్న యాచకురాలికి ఓ వ్యక్తి బిచ్చం వెయ్యడంతో.. అతనిపై భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 223 ప్రకారం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ విషయం కూడా దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
బిచ్చం అడిగినందుకు అరెస్ట్..ఆ వివరాలు ఏంటి?
Read Time:
1 min
Tags:
Ap News in Telugu
arrested
begger
Breaking News in Telugu
Google news
Google News in Telugu
Latest News in Telugu
Madhya Pradesh
Paper Telugu News
Telugu News
Telugu News online
Telugu News Paper
Telugu News Today
Today news
traffic signal
రచయిత గురించి
Vanipushpa
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.