ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళా వేడుకలో మోనాలిసా భోస్లే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.16 ఏళ్ల మోనాలిసా పూసలమ్మకుంటే రాత్రికి రాత్రే ఇంటర్నెట్ సెన్సేషన్ అయింది.ఆమె అందంతో మైండ్ బ్లొవింగ్ చేసిన మోనాలిసా కుంభమేళాలో కనిపిస్తూనే, అభిమానులు ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి ఎగబడ్డారు.ఈ పరిస్థితి ఆమెకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలను తెచ్చింది. అభిమానులు ఆమె వెంటాడడంతో మోనాలిసా వ్యాపారం చాలా నష్టం.దీంతో ఆమె తండ్రి నిర్ణయం తీసుకుని, మోనాలిసాను అక్కడ నుంచి తిరిగి పంపించేశారు.కానీ, అప్పటికే ఆమె వీడియోలు,ఫొటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే మోనాలిసా పేరు ఎక్కడ చూసినా మార్మోగిపోతుంది.

ఇప్పుడు, ఈ సెన్సేషన్ బాలీవుడ్లోనూ అడుగుపెట్టింది. మోనాలిసా తాజాగా తన ప్రథమ చిత్రంకి సంతకం చేసింది.ప్రముఖ దర్శకుడు సనోజ్ మిశ్రా తన సినిమాలో ఆమెకు అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం పేరు “ది డైరీ ఆఫ్ మణిపూర్”.ఈ నేపథ్యంలో, సనోజ్ మిశ్రా స్వయంగా ఇండోర్, మధ్యప్రదేశ్ వెళ్లి మోనాలిసా కుటుంబంతో చర్చలు జరిపారు.ఆమె ఇంటికి వెళ్లి,సినిమాకు సంబంధించి ప్రస్తావించారు. మోనాలిసా ఆఫర్ను అంగీకరించడంతో, ఆమె నుంచి అంగీకార పత్రంపై సంతకం తీసుకున్నారు.చిత్రీకరణ మొదలుపెట్టేముందు, ముంబైలో మోనాలిసాకు యాక్టింగ్ నేర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో రాజ్కుమార్ రావు సోదరుడు అమిత్ రావు నటిస్తున్నట్లు సమాచారం.ఇలా, మోనాలిసా మహా కుంభమేళాలో తమ దృష్టిని ఆకర్షించి, ఇప్పుడు బాలీవుడ్లో కొత్త అంగికారం మొదలెట్టింది.