McDonald sign key agreement with Telangana government..!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్ కీలక ఒప్పందం..!

Telangana Govt : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్

పెట్టుబడుల ఒప్పందం

ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండయా హెడ్ దేశాంత కైలా చర్చల్లో ఉన్నారు.

ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం

మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే స్థాపించాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

Related Posts
ఇనార్బిట్ మాల్‌లో స్ట్రాబెర్రీ ఫెస్ట్ వేడుకలు..
Strawberry Fest Celebrations at Inorbit Mall

సైబరాబాద్ : ఇనార్బిట్ మాల్ సైబరాబాద్ ఇటీవలే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్ట్రాబెర్రీ ఫెస్ట్‌ను ముగించింది. ఇది జనవరి 24 నుండి 26, 2025 వరకు జరిగింది. Read more

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు.. ప్రచారంలో పాల్గొననున్న పవన్ కల్యాణ్
Pawan Kalyan will participate in Maharashtra Assembly Elections campaign

అమరావతి: ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు పవన్‌ కళ్యాణ్‌ మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో రోడ్‌ షోలలు, బహిరంగ Read more

తెలంగాణ లో పెరిగిన ఎండలు – రికార్డు స్థాయిలో విద్యుత్​ డిమాండ్
Electricity demand at recor

ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో విద్యుత్తు వినియోగం తెలంగాణలో ఎండల ప్రభావం ముందుగానే చూపిస్తున్నాయి. ఫిబ్రవరి నెల నుంచే ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతుండటంతో, విద్యుత్ వినియోగం కూడా రికార్డు Read more

ఆరిలోవ లో నూతన పోలీస్ భవనాన్ని ప్రారంభించిన హోం మంత్రి అనిత
Home Minister Anitha inaugu

ఆరిలోవ హనుమంతువాక వద్ద ఎకరం స్థలంలో 17 గదులతో విశాలముగా నిర్మించిన ఆరిలోవ పోలీస్ స్టేషన్ నూతన భవనాన్ని ఆదివారం రాష్ట్ర హోం శాఖ మంత్రివర్యులు వంగలపూడి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *