McDonald sign key agreement with Telangana government..!

Telangana Govt: తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్ కీలక ఒప్పందం..!

Telangana Govt : అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ సంస్థ మెక్ డోనాల్డ్స్ తెలంగాణ ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది. సంస్థ విస్తరణలో భాగంగా మెక్ డొనాల్స్డ్ ఇండియా గ్లోబల్ ఆఫీస్ ను హైదరాబాద్ లో నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. 2,000 మంది ఉద్యోగులతో మెక్ డొనాల్డ్ గ్లోబల్ ఇండియా ఆఫీసును ప్రారంభించనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం ఉదయం అసెంబ్లీలోని ఛాంబర్లో మెక్‌ డొనాల్డ్స్ ఛైర్మన్, సీఈవో క్రిస్ కెంప్కెజెన్స్కీతో పాటు సంస్థ ప్రతినిధులతో చర్చలు జరిపారు.

Advertisements
తెలంగాణ ప్రభుత్వంతో మెక్ డోనాల్డ్స్

పెట్టుబడుల ఒప్పందం

ఈ సందర్భంగా తమ గ్లోబల్ ఆఫీస్ ఏర్పాటుకు సంబంధించి మెక్ డొనాల్డ్స్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడుల ఒప్పందం చేసుకుంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. మెక్‌డొనాల్డ్స్ ప్రతినిధుల బృందంలో సీఈవో తో పాటు గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ అధ్యక్షుడు స్కై ఆండర్సన్, చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్, గ్లోబల్ ఇండయా హెడ్ దేశాంత కైలా చర్చల్లో ఉన్నారు.

ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం

మెక్‌డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు ముందుకు రావటంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ గ్లోబల్ సెంటర్ తమ రాష్ట్రంలోనే స్థాపించాలని పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న సందర్భంలో మెక్ డొనాల్డ్ సంస్థ తెలంగాణను తమ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఎంచుకోవటం గర్వంగా ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. గత 15 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధికి చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు.

Related Posts
మీ బ్యాంకు వడ్డీరేటు తగ్గించకుంటే ఏం చేయాలో తెలుసా..?
RBI Bank Rpao

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 25 బేసిస్ పాయింట్లు (bps) వడ్డీ రేటును తగ్గించిన తర్వాత, అన్ని బ్యాంకులు తమ కస్టమర్లకు ఈ ప్రయోజనాన్ని అందించాల్సిన Read more

flight ticket prices : భారత్ నుంచి అమెరికాకు చార్జీల్లో అనూహ్య తగ్గుదల
flight ticket prices భారత్ నుంచి అమెరికాకు చార్జీల్లో అనూహ్య తగ్గుదల

వేసవి వచ్చిందంటే చాలు… విదేశీ ప్రయాణాలకి డిమాండ్ పెరుగుతుంది.అమెరికా వెళ్లే వారికి టికెట్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటాయి.కానీ ఈ సీజన్ మాత్రం అదృష్టాన్ని తెచ్చిందనే చెప్పాలి.ఈసారి ట్రెండ్ Read more

టన్నెల్ ప్రమాదం వద్దకు వెళ్లనున్న: సీఎం
టన్నెల్ ప్రమాదం వద్దకు వెళ్లనున్న: సీఎం

తెలంగాణలోని ఎస్ఎల్ బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదం 8 మంది కార్మికుల మరణానికి కారణమైంది. ఈ దురదృష్టకరమైన ఘటన శనివారం వెలుగుచూసింది. సొరంగం కూలిపోవడంతో కూలిన బురదలో Read more

ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు.. ఐదుగురు మృతి
Massive explosion in Ordnance Factory.. Five people died.

ముంబయి : మ‌హారాష్ట్ర‌లోని భండారా జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. నాగ‌పూర్‌కు స‌మీపంలో ఉన్న ఓ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీలో భారీ పేలుడు సంభ‌వించింది. పేలుడు ధాటికి ఆర్డినెన్స్ Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×