Justice Sujoy Paul as the new CJ of Telangana High Court

తెలంగాణ హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ సుజయ్ పాల్

హైరదాబాద్‌: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సుజయ్ పాల్‌కు సీజేగా బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న జస్టిస్ ఆలోక్ అరాధే.. బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.

Advertisements

జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ విద్యను పూర్తి చేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో తన పేరు నమోదు చేసుకున్నారు. అనంతరం.. పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు తన సేవలను అందించారు. 2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్.. 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. అనంతరం సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న ఆయన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ అయ్యారు. కాగా.. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులవటం గమనార్హం.

image
image

కాగా, జస్టిస్‌ అరాధే తెలంగాణ హైకోర్టులు 18 నెలల పాటు సేవలు అందించారు. 2023 జులై 19న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆలోక్ అరాధే నియమితులయ్యారు. జులై 23న పదవీ ప్రమాణంచేసి బాధ్యతలు చేపట్టారు. 1964 ఏప్రిల్‌ 13న రాయ్‌పుర్‌లో జన్మించిన జస్టిస్‌ ఆలోక్ అరాధే.. 1988 జులై 12న న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. జబల్‌పుర్‌లోని మధ్యప్రదేశ్‌ హైకోర్టులో ప్రాక్టీస్‌ కొనసాగించారు. 2009 డిసెంబరు 29న మధ్యప్రదేశ్‌ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2011 ఫిబ్రవరి 15న అక్కడే శాశ్వత న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Related Posts
ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలో మొత్తం 10 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. దీనితో, ఏపీకి ఐదు, తెలంగాణకు ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు Read more

వివేకా హత్య కేసు – భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు
viveka murder case baskar r

వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. వైఎస్ సునీత దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం సీజేఐ జస్టిస్ Read more

తెలంగాణ లో ఐదేళ్లలో 2,722 కి.మీ హైవేల నిర్మాణం పూర్తి – కేంద్రం
telangana Highway roads

తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. ఈ క్రమంలో గత ఐదేళ్లలో 2,722 కి.మీ మేర హైవేలను నిర్మించామని కేంద్ర మంత్రి నితిన్ Read more

Ola, rapido, uber: సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌
సహకార్‌ యాప్‌తో ఓలా, ఉబర్‌, ర్యాపిడో దోపిడికి చెక్‌

ప్రధాన నగరాల్లో ఓలా, ఉబర్‌, ర్యాపిడోల వినియోగం బాగా పెరిగిపోయింది. విపరీతంగా పెరుగుతున్న డిమాండ్‌ దృష్ట్యా.. ఆయా కంపెనీలు వినియోగదారుల నుంచి భారీగా ఛార్జీలు వస్తూలు చేస్తున్నాయి. Read more

Advertisements
×