పహల్గాం(Pahalgam) ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్(Bharath) చేపట్టిన ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) ను జపాన్ వ్యూహాత్మక నిపుణులు సతోరు నాగావ్ ప్రశంసించారు. బాధ్యతాయుతమైన, సరైన ప్రతిస్పందనగా వర్ణించారు. పాకిస్థాన్ (Pakistan) ఉగ్రవాదానికి ఇస్తున్న మద్దతును ఖండించారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గాం(Pahalgam)లో జరిగిన ఉగ్రదాడిని భయంకరమైదని అన్నారు. ఈ మేరకు జాతీయా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇస్తున్నది
భారత్ ఉగ్రవాదంతో బాధపడుతోందని, పాకిస్థాన్ మద్దతు ఇస్తుందని ఉద్ఘాటించారు. ఉగ్రవాదానికి ఇస్లామాబాదా మద్దతు ఇవ్వడం సుదీర్ఘం కాలంగా ఉందని గుర్తుచేశారు. పహల్గాం ఉగ్రదాడి చాలా దారుణమమని అన్నారు. చనిపోయిన తన భర్త పక్కన ఓ మహిళ కూర్చుని ఉన్న చిత్రం చూసి భావోద్వేగపరంగా కదిలిపోయామని చెప్పారు. కాబట్టి పాక్కు గుణపాఠం చెప్పాలని, ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని తెలిపారు.

ప్రపంచానికి ఉగ్రవాదంతో ముప్పు
“నేను వ్యక్తిగతంగా భారత్కు మద్దతు ఇస్తున్నాను. ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న పాకిస్థాన్ అది తప్పు అని తెలుసుకోవడం లేదు. ఉగ్రవాదం చాలా ప్రమాదకరమైనది. భారత్కు మాత్రమే కాదు ఇతర దేశాలకు కూడా ఆ ముప్పు ఉంది. అది విషాదకరమైన పరిస్థితి” అని తెలిపారు. మే 7న పాక్, పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నందుకు భారత్ ప్రశంసించారు. శిక్షకు మంచి ఉదాహరణ అని అన్నారు. ఉగ్రవాదులకు మద్దతు ఇవ్వడం ప్రమాదకర వ్యూహమని పాకిస్తాన్ తెలుసుకోవాలని ఆయన పేర్కొన్నారు.
పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించిన హిరోస్ హిరోమి
“ప్రపంచంలోని ప్రజలు పాకిస్థాన్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తోందని అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఉగ్రవాదం ఒక సమస్య. కానీ అదే సమయంలో ఇప్పటికీ చాలా మంది ఉగ్రవాదం ప్రపంచ వ్యవహారం కాదు. ప్రాంతీయ సమస్య అని నమ్ముతారు. ఉగ్రవాదులను అణచివేయడం నిజానికి ప్రాంతీయ సమస్య కాదు, ఇది ప్రపంచ సమస్య” అని నాగావో అన్నారు. మరోవైపు, పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కిందాయ్ విశ్వవిద్యాలయంలోని పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ హిరోస్ హిరోమి తెలిపారు.
జపాన్లో పర్యటించిన అఖిలపక్ష దౌత్య బృందం
అయితే పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదంపై తాము జరుపుతున్న పోరు గురించి ప్రపంచ దేశాలకు వివరించేందుకు భారత్ మొత్తం ఏడు అఖిలపక్ష దౌత్య బృందాలను ఏర్పాటు చేసింది. ఆ బృందాలు 33 దేశాల్లో పర్యటిస్తున్నాయి. తాజాగా సంజయ్ కుమార్ ఝా నేతృత్వంలోని అఖిలపక్ష దౌత్య బృందం జపాన్లో పర్యటించింది. అందులో సీపీఎం ఎంపీ జాన్ బ్రిట్టాస్, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ, బీజీపీ ఎంపీలు హేమాంగ్ జోషి, అపరాజిత సారంగి, బ్రిజ్ లాల్, ప్రధాన్ బారుహ్ ఉన్నారు. వారంతా జపాన్తోపాటు ఇండోనేసియా, మలేసియా, దక్షిణ కొరియా, సింగపూర్ వెళ్లనున్నారు.
Read Also: Palestine: పాలస్తీనా కోసం వారిని చంపాను ..ఇజ్రాయెల్ హత్యల నిందితుడు