వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహంలో జగన్ సందడి

మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి..జగయ్యపేట వైసీపీ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు కుమార్తె వివాహంలో సందడి చేసాడు. విజయవాడలోని పోరంకి మురళీ రిసార్ట్స్ లో ఈ వివాహ వేడుకగా జరుగగా..ఈ వేడుకకు జగన్ హాజరై, నూతన వధూవరులు సారూప్య, యశ్వంత్ రాజాకు తన ఆశీస్సులు అందజేశారు. వరుడు యశ్వంత్ రాజా మాజీ ఎమ్మెల్యే దేవినేని మల్లికార్జునరావు కుమారుడు. జగన్ రాక సందర్భంగా పెళ్లి వేడుకలో భారీ కోలాహలం నెలకొంది. జగన్ ను కలిసేందుకు జనాలు పోటీలు పడ్డారు. అందరికీ చిరునవ్వుతో అభివాదం చేస్తూ జగన్ ముందుకు సాగారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *