IT rides dilraju

దిల్ రాజు ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు..ఎవరి ఆధ్వర్యంలో అంటే..!!

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో మరోసారి ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సారి ఓ మహిళా అధికారి ఆధ్వర్యంలో ఈ దాడులు జరుగుతుండటం ప్రాధాన్యంగా మారింది. ఇళ్లు, కార్యాలయాలతో పాటు ఇతర ఆస్తులపై కూడా అధికారులు దృష్టి పెట్టారు. గత మూడు రోజులుగా దిల్ రాజు నివాసం, కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున ఈ తనిఖీలు జరగడంతో పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. ప్రధానంగా ఈ దాడుల వెనుక ఉద్దేశం ఏమిటి అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి.

Advertisements

దిల్ రాజు సోదరుడు శిరీష్, కూతురు హన్షితరెడ్డి, ఇతర బంధువుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు ముగించారు. వారి ఆస్తుల వివరాలు, లావాదేవీలపై అధికారులు మరింత సమాచారాన్ని సేకరించారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అధికారికంగా ఇంకా తెలియరాలేదు. దిల్ రాజు నిర్మాణ సంస్థ టాలీవుడ్‌లో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఐటీ దాడులు జరగడం ఇండస్ట్రీలోనే కాకుండా, సినీ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. ఇక రీసెంట్ గా దిల్ రాజు నిర్మించిన గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటిలో సంక్రాంతికి వస్తున్నాం మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకొని వారం రోజుల్లోనే రూ.200 కోట్లు వసూళ్లు చేసి ఇంకా హౌస్ ఫుల్ తో రన్ అవుతుంది. ఇక గేమ్ ఛేంజర్ మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ అయ్యింది.

Related Posts
మాతృభాషను అందరూ మార్చిపోతున్నాం: కిషన్ రెడ్డి
Everyone is changing their mother tongue.. Kishan Reddy

న్యూఢిల్లీ: ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోడీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భిన్న సంస్కృతులు, భిన్న భాషల వైవిధ్యత Read more

హిమపాతంలో చిక్కుకున్న 50 మంది
హిమపాతంలో చిక్కుకున్న 50 మంది

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా లో భారీ హిమపాతం (Avalanche) సంభవించింది.ఈ ఘటనలో సుమారు 50 మందికిపైగా కార్మికులు మంచు గడ్డల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు.ఇప్పటికే 10 మందిని Read more

CM Revanth Reddy : నేడు జపాన్‌కు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు. జపాన్‌లో జరిగే ఒసాకా–కన్సాయ్‌ ఎక్స్‌పో– 2025కు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ Read more

Bomb Threat : మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు
Bomb threats to Medchal Collectorate

Bomb Threats : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు Read more

Advertisements
×