దేశంలోని ప్రముఖ బాక్సర్ మేరీకోమ్, తన 20 సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలకబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మేరీకోమ్, ఆమె భర్త ఓన్లర్ కరుంగ్ విడాకులు తీసుకోబోతున్నారని సమాచారం. త్వరలోనే వీరి విడాకుల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.
2022 మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల ప్రభావం
2022లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు, వారి వివాహ జీవితంపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఈ ఎన్నికల్లో మేరీకోమ్ భర్త పోటీ చేసి ఓడిపోయారు, దీని వలన వీరికి ఆర్థిక నష్టం జరిగింది. ఈ ఆర్థిక నష్టంతో భార్యాభర్తల మధ్య విభేదాలు మొదలయ్యాయి. అప్పటి నుంచి వీరు వేర్వేరుగా నివసిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ప్రస్తుతం విడివిడిగా జీవితం
ప్రస్తుతం, మేరీకోమ్ తన నలుగురు పిల్లలతో కలిసి ఫరీదాబాద్లో నివసిస్తోంది, ఆమె భర్త ఢిల్లీలో ఇతర కుటుంబ సభ్యులతో ఉంటున్నారు. మరో వైపు, మేరీకోమ్, తన భర్త నుండి దూరంగా ఉన్న సమయంలో తన బిజినెస్ పార్టనర్ హితేశ్ చౌదరీతో సంబంధం ఉందని గాసిప్లు వస్తున్నాయి. హితేశ్ చౌదరీ, మేరీకోమ్ ఫౌండేషన్కు ఛైర్మన్గా పని చేస్తున్నారు. వీరి సంబంధం గురించి వార్తలు వచ్చిన నేపథ్యంలో, హితేశ్ తన సోషల్ మీడియాలో మేరీకోమ్తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేసి ఈ వార్తలకు బలం చేకూర్చుతున్నారు.
హితేశ్ చౌదరీ భార్య కూడా బాక్సర్
అందరికీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, హితేశ్ చౌదరీ భార్య కూడా ఒక బాక్సర్ అని తెలుస్తోంది, ఇది సర్వత్రా చర్చకు వస్తుంది. మేరీకోమ్, తన వివాహ బంధాన్ని ముగించుకునే నిర్ణయం తీసుకోవడంలో ఉంది. ఆమె భర్తతోని వివాదం, ఆర్థిక నష్టాలు, ఆమె బిజినెస్ పార్టనర్ హితేశ్ చౌదరీతో సంబంధం గురించి వస్తున్న వార్తలు, ఇంతకు ముందు జరిగిన మణిపూర్ ఎన్నికల ప్రభావం అంతా ఈ పరిణామాలకు కారణంగా చెప్పబడుతుంది.