ఇరాన్ అణు కార్యక్రమంపై రెండవ రౌండ్ చర్చలు మొదలయ్యే వేళ, మిడ్ ఈస్ట్ జలాల్లో రెండవ యుఎస్ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ (USS కార్ల్ విన్సన్) ఉనికిని పెంచింది. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారుల నియంత్రిత ప్రాంతాల్లో అమెరికా వైమానిక దాడులు కూడా జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ పరిణామాలు చర్చలపై ఒత్తిడి పెంచే వ్యూహంగా వాడుతున్నట్లు అనిపిస్తోంది.
హౌతీలపై దాడుల నేపథ్యంలో ట్రంప్ వ్యూహం
ట్రంప్ నేతృత్వంలోని ప్రభుత్వం గత నెలలుగా హౌతీలపై దాడులు కొనసాగిస్తోంది. ఇది ఇరాన్పై ప్రతిఘటన, అణు చర్చలపైనా మానసిక ఒత్తిడిని కలిగించడానికి వ్యూహంగా భావించబడుతోంది. “మరింత ఒత్తిడి–మరింత అంగీకారం” అనే విధానాన్ని అమెరికా అనుసరిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

చర్చల వేదికపై అస్పష్టత – ఒమన్ vs రోమ్
మొదట చర్చలు రోమ్లో జరుగుతాయని భావించినా, ఇరాన్ మాత్రం ఒమన్లోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. చర్చల వేదికపై స్పష్టత లేకపోవడమే కాకుండా, ఈ చర్చల భవిష్యత్తు పట్ల అనిశ్చితి నెలకొంది.
అణు ఒప్పందం – 2015 ఒప్పందాన్ని ఆధారంగా తీసుకునే అవకాశం. అమెరికా రాయబారి స్టీవ్ విట్కాఫ్ ప్రకారం, ఈ చర్చలు 2015 అణు ఒప్పందాన్ని ప్రాతిపదికగా కొనసాగే అవకాశం ఉంది.
ట్రంప్ 2018లో ఈ ఒప్పందం నుంచి అమెరికాను ఏకపక్షంగా తొలగించిన విషయం తెలిసిందే.
ఇరాన్ యురేనియం సుసంపన్నత స్థాయిపై ప్రధాన దృష్టి
ప్రస్తుతం టెహ్రాన్ 60% వరకు యురేనియం సుసంపన్నం చేస్తోంది. ఇది ఆయుధ-స్థాయి (90%)కి చాలా సమీపంలో ఉంది. విట్కాఫ్ ప్రకారం, 3.67% సుసంపన్నత మాత్రమే పౌర అణు అవసరాలకు సరిపోతుంది, దాన్ని మించడమే అనుమానానికి తావిస్తోంది. “వారు బాంబుల కోసం ట్రిగ్గర్ మెకానిజాన్ని సిద్ధం చేస్తున్నారా?” అనే అనుమానం విట్కాఫ్ వ్యాఖ్యల ద్వారా వ్యక్తమవుతోంది. క్షిపణుల నిల్వలు, వాటి శక్తి సామర్థ్యాలు కూడా చర్చల కీలక అంశాలుగా మారాయి. USS కార్ల్ విన్సన్ తో పాటు, ప్రిన్స్టన్, స్టెరెట్, విలియం పి లారెన్స్ లాంటి ఆధునిక క్షిపణి యుద్ధ నౌకలు ఉన్నాయి. నేవీ విడుదల చేసిన వీడియోలలో F-35, F/A-18 ఫైటర్ జెట్లు విన్సన్ డెక్ పై ప్రయోగించిన దృశ్యాలు ఉన్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా చెబుతున్న స్పష్టమైన లక్ష్యం “ఇది పూర్తిగా ధృవీకరణపై ఆధారపడే అంశం – సుసంపన్నత స్థాయి మాత్రమే కాదు, ఆయుధీకరణకు సంబంధించిన అంశాలపై స్పష్టత రావాలి”
స్టీవ్ విట్కాఫ్, యుఎస్ మిడ్ ఈస్ట్ రాయబారి
ఇరాన్ అణు కార్యక్రమం, హౌతీలపై దాడులు, విమాన వాహక నౌకల మోహరింపు… ఇవన్నీ భవిష్యత్తులో భారీ సైనిక పరిణామాలకు సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఒకవైపు దౌత్యపరమైన చర్చలు, మరోవైపు సైనిక చర్యల భయం – ఈ రెండు దేశాల మధ్య సంబంధాల మార్గాన్ని నిర్ణయించబోతున్నాయి.