అమెరికా(America)తో అణు ఒప్పందంపై చర్చలు పునఃప్రారంభించేందుకు ఇరాన్(Iran) ఒక కఠినమైన షరతు విధించింది. భవిష్యత్తులో తమ దేశంపై అమెరికా గానీ, ఇజ్రాయెల్(Israel) గానీ ఎలాంటి దాడులకు పాల్పడబోమని కచ్చితమైన హామీ ఇస్తేనే చర్చలు సాధ్యమవుతాయని స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్(India)లోని ఇరాన్ రాయబారి ఇరాజ్ ఎలాహి(Iraj Elahi) ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం నుంచి అలాంటి విశ్వసనీయమైన హామీ లభించనంత వరకు చర్చలకు ఎలాంటి అర్థం ఉండదని ఆయన తేల్చిచెప్పారు.
‘ఆపరేషన్ రైజింగ్ లయన్’
గతంలో తమ అణు కేంద్రాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ‘ఆపరేషన్ రైజింగ్ లయన్’ పేరుతో దాడులు చేసిందని ఇరాజ్ ఎలాహి గుర్తుచేశారు. ఈ దాడుల్లో తమ దేశం ఎంతోమంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, సైనిక అధికారులతో పాటు అమాయక పౌరులను కూడా కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు అణ్వాయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందంపై సంతకం చేయని ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, అలాంటి దేశం తమపై దాడులు చేయడం సరికాదని ఆయన విమర్శించారు.

ఇరాన్ వైఖరి – దౌత్యానికి తాము సిద్ధం
చర్చలు జరుగుతున్న సమయంలోనే అమెరికాతో చేతులు కలిపి ఇజ్రాయెల్ ఈ దాడులకు పాల్పడటం దౌత్య ద్రోహమని ఆయన ఆరోపించారు. ఈ దాడులు ఐక్యరాజ్యసమితి చట్టాలను పూర్తిగా ఉల్లంఘించాయని అన్నారు. చరిత్రలో ఇరాన్ ఏ దేశం పైనా దాడి చేయలేదని, గాజా విషయంలో కూడా శాంతియుత వైఖరినే ప్రదర్శించిందని తెలిపారు. తాము ఎప్పుడూ దౌత్యానికి సిద్ధంగానే ఉంటామని ఆయన స్పష్టం చేశారు.
శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పౌరులు మృతి
ఈ దాడుల్లో అనేక మంది శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, పౌరులు మృతి చెందారు.
ఇదంతా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం అని ఎలాహీ విమర్శించారు.
ఇజ్రాయెల్ వద్ద అణ్వాయుధాలు ఉండడమే అన్యాయం?
ఇజ్రాయెల్ NPT (Non-Proliferation Treaty) ఒప్పందంపై సంతకం చేయకుండా
అణ్వాయుధాలను కలిగి ఉండడం, మరియు అదే దేశం ఇరాన్పై దాడులు చేయడం అన్యాయం అని ఎలాహీ విమర్శించారు. చరిత్రలో ఇరాన్ ఎక్కడా ముందుగా దాడి చేయలేదని,
గాజా విషయంలో కూడా తాము శాంతియుత వైఖరి పాటించామని స్పష్టం చేశారు.
దౌత్యమే తమ మార్గం అని తేల్చి చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: India: దలైలామా వారసుడిపై చైనా జోక్యం – భారత్ ఖండన