Donald Trump: కశ్మీర్‌‌‌ పై డోనల్డ్ ట్రంప్ ప్రకటనపై భారత్ మౌనం ఎందుకు?

Read Time:  1 min
US: అమెరికా కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థిక నష్టాలు ..మోదీ విధానం అంటే ఇదే మరి!
US: అమెరికా కార్పొరేట్ దిగ్గజాలకు ఆర్థిక నష్టాలు ..మోదీ విధానం అంటే ఇదే మరి!
FONT SIZE
GET APP

భారత్, పాకిస్తాన్ (Bharath, Pakistan) మధ్య గత కొన్నిరోజులుగా ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ సమయంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో (Marco Rubio), ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance)చురుగ్గా వ్యవహరించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shabaj Sharif), భారత విదేశాంగ మంత్రి జైశంకర్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌ (Pakistan army chief Asim Munir)లతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారం మధ్యాహ్నం త్రివిధ దళాల అధిపతులతో సమావేశం నిర్వహించారు. పాకిస్తాన్‌తో వివాదాన్ని ముగించడానికి భారత్ నుంచి కనిపించిన మొదటి సూచన ఇది. అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో భారత డీజీఎంవోతో పాకిస్తాన్ డీజీఎంవో ఫోన్లో మాట్లాడారు.

DonaldTrump :కశ్మీర్‌‌‌ పై డోనల్డ్ ట్రంప్ ప్రకటనపై భారత్ మౌనం ఎందుకు?
DonaldTrump :కశ్మీర్‌‌‌ పై డోనల్డ్ ట్రంప్ ప్రకటనపై భారత్ మౌనం ఎందుకు?

భారత్, పాకిస్తాన్ ‘కాల్పుల విరమణ’పై..
అయితే, భారత్, పాకిస్తాన్ ‘కాల్పుల విరమణ’పై మొదటి సమాచారం అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఆ తర్వాత పాకిస్తాన్, భారత ప్రభుత్వాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని అధికారికంగా ప్రకటించాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ ఎక్స్‌లో ‘కాల్పుల విరమణ’ను ధ్రువీకరించారు. అమెరికా, సౌదీ అరేబియా, బ్రిటన్‌తో సహా ముప్పైకి పైగా దేశాలు దౌత్య ప్రయత్నాలలో పాల్గొన్నాయని ఆయన అన్నారు.
అమెరికా ఎందుకు ముందుకొచ్చింది?
“ఇరు దేశాల మధ్య ఘర్షణ మరింత పెరిగితే, పాకిస్తాన్ ఏ చర్యకైనా దిగొచ్చని అమెరికా ఆందోళన చెంది ఉంటుంది. డీజీఎంవో ద్వారా భారత్‌తో మాట్లాడాలని పాకిస్తాన్‌పై అమెరికా ఒత్తిడి తెచ్చినట్లు కనిపిస్తోంది” అని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్, అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు ప్రొఫెసర్ చింతామణి మహాపాత్ర అన్నారు.


Read Also: Oparation sindoor : మా సైనికులు 11 మంది మృతి: పాక్

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.