Shehbaz Sharif: మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు వెళ్లం

Read Time:  1 min
మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు వెళ్లం
మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు వెళ్లం
FONT SIZE
GET APP

మిత్రదేశాలు తమను కేవలం సహాయం అర్థించే దేశంగా చూడటం లేదని.. వాణిజ్యం, పెట్టుబడులు, నూతన ఆవిష్కరణల్లో సమాన భాగస్వామిగా పరిగణిస్తున్నాయని పాకిస్థాన్‌ ప్రధానమంత్రి షెహబాజ్‌ షరీఫ్‌(Shehbaz Sharif) పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “పాకిస్థాన్‌(Pakistan)కు చైనా(china) ఎప్పుడూ అండగా నిలిచే మిత్రదేశం. అలాగే సౌదీ అరేబియా, తుర్కియే, ఖతర్‌, యూఏఈ, అజర్‌బైజాన్‌ వంటి దేశాలు కూడా అత్యంత విశ్వసనీయమైన స్నేహితులు. ప్రస్తుతం ఈ దేశాలన్నీ మాతో వాణిజ్యం, ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి, విద్య, వైద్య రంగాల్లో పరస్పరం కలిసి పనిచేయాలని ఆశిస్తున్నాయి. మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు రావాలని వారు కోరుకోవడం లేదు” అని పేర్కొన్నారు.

Shehbaz Sharif: మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు వెళ్లం
Shehbaz Sharif: మేము నిధుల కోసం ‘భిక్షాపాత్ర’తో వారి వద్దకు వెళ్లం

అధిగమించాగలం అధిగమించగలం
బలోచిస్థాన్‌లోని క్వెట్టా కమాండ్‌ అండ్‌ స్టాఫ్‌ కాలేజీలో జరిగిన కార్యక్రమంలో షెహబాజ్ ప్రసంగిస్తూ ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిం మునీర్‌తో పాటు దేశ ఆర్థిక భారాన్ని మోస్తున్న చివరి వ్యక్తిని తానేనని చెప్పారు. దేశంలో సహజ వనరులతో పాటు మానవ వనరులు కూడా సమృద్ధిగా ఉన్నాయని, వాటిని సరైన రీతిలో ఉపయోగించుకోవడం ద్వారా ప్రస్తుత ఆర్థిక సవాళ్లను అధిగమించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

పాకిస్థాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల నిధులను ఐఎంఎఫ్‌ మంజూరు
మరోవైపు, పాకిస్థాన్‌ ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీని ప్రకటించిన సంగతి విదితమే. ఈ ప్యాకేజీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్‌కు ఒక బిలియన్‌ డాలర్ల నిధులను ఐఎంఎఫ్‌ మంజూరు చేసింది. అయితే, ఈ నిధుల విడుదలకు పలు కఠిన షరతులను విధించిన ఐఎంఎఫ్.. భారత్‌తో ఉద్రిక్తతలు పెంచుకుంటే అది పాకిస్థాన్‌కే ఎక్కువ నష్టం కలిగిస్తుందని హెచ్చరించింది. అలాంటి చర్యలు దేశంలో ఆర్థిక, ఇతర సంస్కరణల లక్ష్యాలకు ఆటంకం కలిగిస్తాయని ఐఎంఎఫ్‌ స్పష్టం చేసినట్లు సమాచారం.

Read Also: Zelenskyy: రష్యాపై దాడి తర్వాత స్పందించిన జెలెన్​

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.