బంగ్లాదేశ్లోని మహమ్మద్ యూనస్(Muhammud Yunus) నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశ జాతిపితగా బంగబంధు షేక్ ముజిబుర్(Mujibur) రెహమాన్ పేరును తొలగించింది. ఈ మేరకు ఆ దేశ లా అండ్ జస్టిస్ పార్లమెంటరీ సంబంధాల మంత్రిత్వ శాఖ మంగళవారం రాత్రి ఆర్డినెన్స్(Ordinance) జారీచేసింది. స్వాతంత్య్ర సమరయోధుడు.. పదానికి కొత్త నిర్వచనం ఇస్తూ, ఓ చట్టాన్ని యూనస్ ప్రభుత్వం సవరించిందని, జాతిపిత అన్న బిరుదును షేక్ ముజిబుర్ రెహమాన్కు తొలగించినట్టు ‘ఢాకా ట్రిబ్యూన్’ వార్తా కథనం పేర్కొన్నది.

యూనస్ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది
మాజీ ప్రధాని షేక్ హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్ చిత్రపటాన్ని కరెన్సీ నోట్ల నుంచి తొలగించిన కొద్ది రోజుల్లోనే యూనస్ ప్రభుత్వం ఈ చర్యను చేపట్టింది. ‘బంగ్లాదేశ్ విముక్తి యుద్ధానికి యూనస్ ప్రభుత్వం కొత్త నిర్వచనం తీసుకొచ్చింది. బంగబంధు స్వాతంత్య్ర పిలుపు మేరకు యుద్ధం జరిగిందని, బంగ్లాదేశ్ విమోచనం పొందిందని ఇంతకుముందున్న చట్టం పేర్కొన్నది’ అని అంటూ ‘ద డెయిలీ స్టార్’ న్యూస్ పేపర్ పేర్కొన్నది.
కరెన్సీ నోట్లపై ముజిబుర్ రెహ్మాన్ చిత్ర తొలగింపు
బంగ్లాదేశ్ బ్యాంక్, తాత్కాలిక ప్రభుత్వ ఆదేశాల మేరకు, 20, 100, 500, మరియు 1000 టాకాల నోట్లపై షేక్ ముజిబుర్ రెహ్మాన్ చిత్రాన్ని తొలగించింది. ఈ నోట్లపై మతపరమైన నిర్మాణాలు, బెంగాలీ సంప్రదాయాలు, మరియు జులై తిరుగుబాటును ప్రతిబింబించే గ్రాఫిటీలు ముద్రించబడ్డాయి. మహమ్మద్ యూనస్, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా నియమితులయ్యారు. ఆయన పేదరిక నిర్మూలన కోసం మైక్రోఫైనాన్స్ ద్వారా సేవలందించారు. తాత్కాలిక ప్రభుత్వం అవామీ లీగ్ పార్టీకి చెందిన నాయకుల ఆస్తులపై దాడులను నిరోధించేందుకు చర్యలు తీసుకుంటోంది.
Read Also: Trump : హార్వర్డ్ యూనివర్సిటీలో