యుఎస్ లో భారతీయులు ప్రశాంతంగా బ్రతికే పరిస్థితి లేదు. అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి సంచలన నిర్ణయాలతో ముఖ్యంగా భారతీయులకు షాకిస్తున్నారు. అక్రమ వలసదారుల పైన కఠిన చర్యలు తీసుకుంటున్న ట్రంప్ సరైన డాక్యుమెంట్లు లేకుండా దేశంలోకి వచ్చిన వారిని దేశం నుండి పంపిస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా చేతులకు సంకెళ్ళు వేసి ప్రత్యేక విమానాలలో వారిని తరలిస్తున్నారు.

విద్యార్థులకు మొదలైన టెన్షన్
రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ అమెరికా పౌరులు మొదట అని తన నినాదాన్ని తెలిపిన ట్రంప్ వలసదారులను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికా దేశానికి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సైతం ట్రంప్ తీరు అశనిపాతంగా మారింది. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా పట్టుకుంటే భారత్ కు తిప్పి పంపుతున్నారు.
పార్ట్ టైం ఉద్యోగాలను వెనక్కి పంపుతున్నట్రంప్
రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్న ట్రంప్ అమెరికా పౌరులు మొదట అని తన నినాదాన్ని తెలిపిన ట్రంప్ వలసదారులను నియంత్రించే కార్యక్రమంలో భాగంగా రోజుకో సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికా దేశానికి వెళ్లి చదువుకునే విద్యార్థులకు సైతం ట్రంప్ తీరు అశనిపాతంగా మారింది. ముఖ్యంగా భారతదేశం నుండి యూఎస్ కు ఎన్నో కలలతో వెళ్లిన వారికి మింగుడు పడనిదిగా తయారైంది. ఇక తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్న ట్రంప్ శరణార్థులతో పాటు మరికొందరికి గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ నిలిపివేశారు. శరణార్థులు లేదా ఆశ్రయం పొందిన వారు అమెరికాలో శాశ్వత నివాసం కోసం పెట్టుకున్న అభ్యర్థనలను ట్రంప్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసినట్టు ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ వెల్లడించింది. ఇండియన్స్ కు తీవ్ర నష్టం అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంతో భారత్ నుండి అక్కడకు వెళ్లిన వారు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.