భారత్(India) తో సహా పలు దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్(Trump) ప్రతీకార సుంకాలను విధించారు. కెనడా, చైనాలపై అన్నిటి కంటే ఎక్కువ టారీఫ్(Tariffs) లను విధించారు. కానీ మిగతా దేశాలకు మాత్రం 26 శాతం సుంకాలను వేస్తామని చెప్పారు. దీంతో చాలా పెద్ద గొడవ జరిగింది. భారత్ తో సహా అన్ని దేశాలు ఈ ప్రతీకార సుంకాలను ఒప్పుకోలేదు. చైనా అయితే తిరిగి అంతే సుంకాలను విధించింది. దీంతో వాణిజ్య యుద్ధానికి(Trade War) తెర లేచింది. ఇది సద్దు మణగడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుకాలకు బ్రేక్ ఇచ్చారు. 90 రోజుల పాటూ వాటికి నిలిపివేస్తున్నట్టు చెప్పారు.

ఆగస్టు 1 నుంచి అమల్లోకి..
అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల బ్రేక్ ప్రకారం దీని డెడ్ లైన్ జూలై 9 అవుతుంది. దీని బట్టి మరో రెండు రోజుల్లో సుంకాల మోత మోగాలి. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ డెడ్ లైన్ ను మరోసారి పొడగించినట్టు తెలుస్తోంది. కొత్త టారీఫ్ లను ఆగస్టు 1 నుంచి అమలు చేస్తారని చెబుతున్నారు. అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం అధ్యక్షుడు వాణిజ్య ఒప్పందాలను నిర్ణయించే పనిలో నిమగ్నమై ఉన్నారని..అందుకే కొత్త టారిఫ్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయని ఆయన తెలిపారు.
భారత్, చైనా స్పందన – వాణిజ్య యుద్ధానికి నాంది
ఈ ప్రకటనపై భారత్తో పాటు అనేక దేశాలు తీవ్రంగా స్పందించాయి.
చైనా, ప్రతిగా అమెరికా దిగుమతులపై అదే స్థాయిలో ప్రతీకార సుంకాలు విధించింది.
దీంతో వాణిజ్య యుద్ధం ప్రారంభమయ్యిందనే వాదనకు బలం చేకూరింది. “ప్రస్తుతం అధ్యక్షుడు కొత్త వాణిజ్య ఒప్పందాలపై దృష్టి పెట్టారు. అందుకే కొత్త టారీఫ్లు ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి” అని తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Bonalu: బహ్రెయిన్లో అంగరంగ వైభవంగా బోనాల ఉత్సవాలు