General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్

Read Time:  1 min
సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
FONT SIZE
GET APP

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై జరిగిన ఈ దాడుల నేపథ్యంలో భారత సైన్యానికి చెందిన మాజీ ఉన్నతాధికారులు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవణే సామాజిక మాధ్యమంలో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం జరిపిన దాడులను ఉద్దేశిస్తూ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ నరవణే, “సినిమా అప్పుడే అయిపోలేదు.. ఇంకా ఉంది” అంటూ ఒక పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

 General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్
General Manoj Mukund Naravane: సినిమా అప్పుడే అయిపోలేదు.. భారత ఆర్మీ మాజీ చీఫ్

దాడులు కొనసాగించాలి
మరో మాజీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, జనరల్ శంకర్ రాయ్‌చౌదరి కూడా ఈ దాడులపై స్పందించారు. ఉగ్ర స్థావరాలపై భారత బలగాలు చేసిన దాడిని అద్భుతమైన ప్రణాళికతో కూడిన గొప్ప ఆపరేషన్‌గా ఆయన ప్రశంసించారు. ఈ దాడులను భారత్ ఇక్కడితో ఆపకూడదని, కొనసాగించాలని సూచించారు. ఇది యుద్ధం లాంటి పరిస్థితి కాదని, ఇప్పటికే ఇరుదేశాల మధ్య అప్రకటిత యుద్ధం కొనసాగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. కీలక సమయంలో మాజీ ఆర్మీ చీఫ్‌ల నుంచి ఈ తరహా స్పందన రావడం గమనార్హం.
దాడి దృశ్యాల విడుదల
ఆపరేషన్ సిందూర్‌పై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన మీడియా సమావేశంలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ పాల్గొన్నారు. కోట్లీలోని గుల్పూర్ ఉగ్రవాద శిబిరంపై భారత సైన్యం ఎలా దాడి చేసిందో వివరిస్తూ కల్నల్ సోఫియా ఖురేషి ఒక వీడియోను ప్రదర్శించారు. గతంలో ఫూంచ్‌ సెక్టార్‌లో దాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఇక్కడే శిక్షణ తీసుకున్నారని ఆమె పేర్కొన్నారు. ఈ దాడికి సంబంధించిన వీడియో దృశ్యాలను కూడా సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. భారత మాజీ ఆర్మీ చీఫ్‌లు, రిటైర్డ్ జనరల్స్, మిలటరీ నిపుణుల ప్రకటనలు చూస్తే, భారత్ ఉగ్రవాదం మీద యుద్ధాన్ని కొనసాగించే సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ దాడులు ఒక మిషన్ ముగింపు కాదు – ప్రారంభం మాత్రమే అని వారి అభిప్రాయాలు సూచిస్తున్నాయి. “భారత్ ఇక్కడితో ఆగకూడదు… ఇది యుద్ధం కాదు, అప్రకటిత యుద్ధం ఇప్పటికే సాగుతోంది” అని స్పష్టం చేశారు.

భారత్ తమ రక్షణ హక్కును నిర్భయంగా వినియోగించాలన్నారు.

Read Also: Trump : అమెరికా ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులకు కొత్త ఆఫర్ – $1000 ప్రోత్సాహకం

Sudha

రచయిత గురించి

Sudha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.