ఢిల్లీ యూనివర్సిటీ(Delhi University) నుండి చదువు పూర్తి చేసిన వైభవ్ తనేజా(Vaibhav Taneja) ఈ రోజుల్లో వార్తల్లో నిలుస్తున్నారు. ఇందుకు కారణం అతని జీతం ప్యాకేజీ గురించి జరుగుతున్న చర్చ. జీతం పరంగా చూస్తే అతను గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్(Sundar Pichai) ఇంకా మైక్రోసాఫ్ట్ సత్య నాదెళ్ల(Satya Nadella)లను కూడా అధిగమించారు. నిజానికి టెస్లా(Tesla) అధినేత అలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన బిలియనీర్ పారిశ్రామికవేత్త ఎలోన్ మస్క్ వైభవ్ తనేజాకు అతిపెద్ద జీతం ప్యాకేజీని అఫర్ చేసారు.

సుందర్ పిచాయ్, సత్య నాదెళ్లలను అధికమించి జీతం
ఎలోన్ మస్క్ కంపెనీ టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజా 2024 సంవత్సరంలో మొత్తం $139.5 మిలియన్లు అంటే దాదాపు రూ.1157 కోట్లు జీతం అందుకున్నారు. కేవలం 4 లక్షల డాలర్ల మూల వేతనం ఉన్న వైభవ్ తనేజా గత సంవత్సరం తన జీతంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. అతని జీతంలో ఎక్కువ భాగం టెస్లా స్టాక్ ఆప్షన్లు ఇంకా ఈక్విటీ అవార్డుల నుండి వస్తుంది. వాల్ స్ట్రీట్ నివేదిక ప్రకారం, 2024 సంవత్సరంలో వైభవ్ తనేజా జీతం విషయంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఇంకా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లలను కూడా అధిగమించారు. 2024 సంవత్సరంలో సత్య నాదెళ్ల $79.1 మిలియన్లు సంపాదించగా, సుందర్ పిచాయ్ $10.73 మిలియన్లు జీతం పొందారు. నిజానికి టెస్లా షేర్ల పెరుగుదల కారణంగా వైభవ్ తనేజా ఆదాయాలు పెరిగాయి.
ఎవరు ఈ వైభవ్ తనేజా?
ఎలోన్ మస్క్ కంపెనీ నుండి అంత పెద్ద ప్యాకేజీ పొందిన వైభవ్ తనేజా నిజానికి భారతీయుడు. 1999లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి కామర్స్ చదివిన తర్వాత, అతను 2000లో చార్టర్డ్ అకౌంటెంట్ డిగ్రీని పొందాడు. 2006లో అతను చదువు కోసం అమెరికా వెళ్లి అక్కడ CPA డిగ్రీని పొందాడు. తరువాత అతను 2017లో టెస్లాలో చేరారు. వైభవ్ తనేజా టెస్లాకు CFOగా, టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం భారతదేశంలో టెస్లా కంపెనీని విస్తరించే బాధ్యత అతని భుజాలపై ఉంది.
Read Also: Donald Trump : భారత్-పాక్ గొడవ ఆపింది నేనే: ట్రంప్