Army: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం

Read Time:  1 min
తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం
తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం
FONT SIZE
GET APP

దక్షిణ వజీరిస్తాన్‌(waziristan)లో తెహ్రీక్-ఎ-తాలిబన్(tehrik-a-taliban) జరిపిన తీవ్రమైన దాడిలో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ షా(pakistan army major moiz abbas shah) మరణించారు. ఈ దాడిలో మొత్తం 15 మంది పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడులపై పాక్ అధికారిక ప్రకటన ఇవ్వకపోయినా, కొంతమంది సైనికుల మరణాన్ని అంగీకరించారు.
మేజర్ మోయిజ్ అబ్బాస్ – 2019లో వార్తల్లోకి
2019లో బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ సమయంలో భారత వాయుసేన గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్‌ను పట్టుకొని హింసించిన మేజర్ మోయిజ్ అబ్బాస్ అప్పట్లో తెగ పాపులర్ అయ్యాడు. అతను “అభినందన్‌ను బంధించి విచారణ చేశాం” అని ప్రకటించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Pakistan: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం
Pakistan: తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడుల్లో పాక్ సైనికులకు భారీ నష్టం

సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్న సమయంలో దాడి
దక్షిణ వజీరిస్తాన్‌లోని సర్గోధా ప్రాంతంలో తెహ్రీక్-ఎ-తాలిబన్ దాడి జరిపిన సమయంలో మేజర్ మోయిజ్ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొంటున్నాడు. అదే సమయంలో అతనిపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.

అభినందన్ ఎఫెక్ట్? వ్యతిరేక శక్తుల లక్ష్యం
భారతీయులు గ్రూప్ కెప్టెన్ అభినందన్‌పై పాక్ సైన్యం చూపిన అమానవీయతను మర్చిపోలేదు. ఇప్పుడు ఆ అమానవీయ చర్యలకు పాల్పడిన మేజర్ మోయిజ్ అబ్బాస్ హత్య అవడం నేపథ్యంగా “కర్మ తిరిగి తన్నింది” అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

అధికారిక ధృవీకరణకై నిరీక్షణ
ఇప్పటివరకు పాకిస్తాన్ ఆర్మీ ఈ దాడులను అధికారికంగా ధృవీకరించలేదు. కానీ స్థానిక మీడియా వర్గాలు, ఉగ్రవాదుల గ్రూపుల వర్గాలు ఈ ఘటనకు సంబంధించి వివరాలను వెలికితీస్తున్నాయి. మోయిజ్ మృతి పాక్ సైన్యంలో కలకలం రేపినట్లు తెలుస్తోంది. దీంతో మేజర్ సయ్యద్ మోయిజ్ అబ్బాస్ పేరు వార్తల్లోకి వచ్చింది. తాలిబాన్ దాడి చేసినప్పుడు మేజర్ సయ్యద్ సర్గోధా ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌లో ఉన్నాడు. 2019లో భారత్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఎయిర్ స్ట్రైయిక్ చేసింది.గ్రూప్ కెప్టెన్ అభినందన్ పాకిస్తానీ F-16ను కూల్చివేసాడు. ఆ సమయంలో అతని MIG-21 కూలిపోయింది. దీంతో అతను పాకిస్తాన్‌లో పడి ఆ దేశ సైన్యానికి పట్టుబడ్డాడు. అతని యూనిట్ అభినందన్ బంధించాయని మేజర్ సయ్యద్ పేర్కొన్నారు.

Read Also: Stock market: యుద్ధ భయాలు ఉన్నా లాభాల్లోనే సూచీలు

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.