Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

Read Time:  1 min
అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు
అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు
FONT SIZE
GET APP

అమెరికా(America)లో జరిగిన కాల్పుల్లో భారత్‌(Bharath)కు చెందిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ముఖ్యంగా షాపులోకి కస్టమర్‌లా ప్రవేశించిన ఓ దుండగుడు.. కౌంటర్ వద్ద ఉన్న గుజరాత్(Gujarath) వ్యక్తితో మాట కలిపాడు. ముందుగా బాగానే మాట్లాడినా.. తుపాకీ చూపించి ఆ తర్వాత డబ్బులు డిమాండ్ చేశాడు. భయపడ్డ భారతీయుడు(Indian) గల్లాపెట్టెలో ఉన్న డబ్బులు అన్నీ తీసి ఇచ్చేశాడు. అవన్నీ తీసుకున్న తర్వాత దుండగుడు అతడిపై కాల్పులు జరిపాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు
Indian Man: అమెరికాలో గుజరాత్ యువకుడిని కాల్చి చంపిన దుండగుడు

షాపులో డ్యూటీలో కాల్పులు
అమెరికాలో జరిగిన దుండగుల కాల్పుల్లో భారతదేశానికి చెందిన ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. డబ్బులు దోచుకునేందుకు వచ్చిన దుండగుడు తుపాకీ చూపించి బెదిరించి దోచుకున్నాడు. అనంతరం కాల్పులు జరిపాడు. గుజరాత్ రాష్ట్రం డింగుచా గ్రామానికి చెందిన పరేష్ పటేల్ అనే వ్యక్తి అమెరికాలోని ఓ షాపులో పని చేస్తున్నారు. ఎప్పట్లాగే షాపుకు వెళ్లి అతడు తన డ్యూటీలో భాగంగా కౌంటర్ వద్ద పని చేస్తున్నాడు. ఆ షాపులోకి ప్రవేశించాడు దుండగుడు.

కస్టమర్‌లా షాపులో తిరుగుతూ అన్నీ పరిశీలించాడు.కాగా ఆ షాపులో ఎవరూ లేకపోవడంతో క్యాష్ కౌంటర్ వద్ద ఉన్న పరేష్ పటేల్ వద్దకు దుండగుడు వచ్చాడు. గన్ గురిపెట్టి పరేష్‌ను బెదిరించాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. గన్ చూసి భయపడ్డ పరేష్ పటేల్ అతడు చెప్పినట్లు చేశాడు. క్యాష్ కౌంటర్‌లో ఉన్న డబ్బు దోచుకున్న తర్వాత ఆ వ్యక్తి పరేష్ పటేల్‌పై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆ తర్వాత అక్కడి నుండి పారిపోయాడు. బుల్లెట్ గాయంతో తీవ్ర రక్తస్రావమైన పరేష్ పటేల్ అక్కడికక్కడే మరణించాడు.

Read Also: Adani: చరిత్ర సృష్టించిన అదానీ గ్రూప్.. రికార్డ్ ఆదాయం !

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.