हिन्दी | Epaper

Pahalgam Attack: పహల్గాం దాడిలో తృటిలో బయటపడ్డ జడ్జిలు, ఎమ్మెల్యేలు

Vanipushpa
Pahalgam Attack: పహల్గాం దాడిలో తృటిలో బయటపడ్డ జడ్జిలు, ఎమ్మెల్యేలు

జమ్ము కశ్మీర్ పర్యటనలో ఉన్న కేరళకు చెందిన పలువురు ప్రముఖులు నిన్న పహల్గాంలో జరిగిన ఘోర ఉగ్రవాద దాడి నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, శాసనసభ్యులతో కూడిన ఈ బృందం సురక్షితంగా ఉన్నట్లు కేరళ ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.
ఈ బృందం మొత్తం శ్రీనగర్‌లో క్షేమంగా వుంది
వివరాల్లోకి వెళితే, కేరళ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి. గిరీష్‌తో పాటు ఎమ్మెల్యేలు ముకేశ్‌, కేపీఏ మజీద్, టి. సిద్ధిక్‌, కె. అన్నాలన్ ఇటీవల జమ్మూకశ్మీర్ పర్యటనకు వెళ్లారు. పహల్గాం సమీపంలో ఉగ్రవాదులు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సమయంలో వీరు ఆ ప్రాంతానికి సమీపంలోనే ఉన్నారు. అదృష్టవశాత్తూ వీరికి ఎలాంటి అపాయం జరగలేదు. ప్రస్తుతం ఈ బృందం మొత్తం శ్రీనగర్‌లో క్షేమంగా ఉందని, వారిని సురక్షితంగా కేరళకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎంఓ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.

పహల్గాం దాడిలో తృటిలో బయటపడ్డ జడ్జిలు, ఎమ్మెల్యేలు

రామచంద్రన్ కుటుంబాన్ని ఆదుకుంటాం
అయితే, దురదృష్టవశాత్తు ఇదే దాడిలో కేరళలోని కొచ్చి ఎడపల్లికి చెందిన పర్యాటకుడు ఎన్. రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. రామచంద్రన్ మృతి పట్ల సంతాపం తెలిపిన ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని, వారిని సురక్షితంగా స్వస్థలానికి చేర్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. పహల్గాం సమీపంలోని బైసరన్ లోయ వద్ద సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు పర్యాటకులే లక్ష్యంగా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టాయి.

Read Also: KCR: ఉగ్రదాడిపై కేసీఆర్, కేటీఆర్, కవిత దిగ్భ్రాంతి వ్యక్తం

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

వైమానిక దాడిలో ఇరాన్ భద్రతా చీఫ్ మృతి

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

కాబూల్ దాడిపై ఆఫ్ఘన్ క్రికెటర్ ఆవేదన

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

ఇజ్రాయెల్ పై దాడులు మరింత తీవ్రం చేసిన ఇరాన్

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

‘డూమ్స్ డే’ విమానాలను రంగంలోకి దింపిన అమెరికా.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా ?

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

యుద్ధం ఎఫెక్ట్.. గల్ఫ్ దేశాలకు విమానాలు బంద్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

మాస్కోలో చికిత్స? ఖమేనీపై రూమర్స్

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ట్రంప్‌కు షాక్ NCTC చీఫ్ రాజీనామా

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇంధన ఆదా కోసం బుధవారాన్ని సెలవుగా ప్రకటించిన శ్రీలంక

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజాని, టాప్ కమాండర్ గొలాంరెజాలను హతమార్చిన ఇజ్రాయెల్

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఇరాన్ నుండి ఢిల్లీకి చేరిన 45 మంది విద్యార్థులు

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఎలన్ మస్క్ VS సామ్ ఆల్ట్‌మాన్..

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

ఇరాన్ యుద్ధం..రాయలసీమ అరటి రైతులకు భారీ దెబ్బ

📢 For Advertisement Booking: 98481 12870