శాంతిని పరిరక్షించడంలో భారత్ ప్రధాన మద్దతుదారు అని ఐక్యరాజ్యసమితి(UNO) అండర్ సెక్రటరీ జనరల్ జీన్ పియర్ లాక్రోయిక్స్(Jean-Pierre) కొనియాడారు. నేరాలకు జవాబుదారీతనం నిర్ధరించే ప్రయత్నాలకు నాయకత్వం వహించడం వంటి వివిధ చర్యల్లో భారత్(India) కీలకపాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ మేరకు శాంతి పరిరక్షకుల అంతర్జాతీయ దినోత్సవం(International Day) సందర్భంగా గురువారం విలేకరుల సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు.

“భారత్ దళాలు ముఖ్యమైనవి. ఆ దేశంలో పోలీసుల సహకారం ఎక్కువగా ఉంటుంది. పురుషులతోపాటు మహిళల ముఖ్యమైన సహకారంతో వివిధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడంలో భారత్ ముఖ్యమైన మద్దతుదారు. నేరాలకు జవాబుదారీతనంపై భారత్ నాయకత్వం వహించిన అనేక ఇతర ఉదాహరణలు ఉన్నాయి” అని జీన్ పియర్ లాక్రోయిక్స్ అన్నారు.
రాజకీయ ప్రక్రియల్లో మహిళల పాత్ర
“ఎక్కువ మంది మహిళలు ఉండటం వల్ల మరింత ప్రభావవంతమైన శాంతి పరిరక్షణకు హామీ ఇస్తుంది. రాజకీయ ప్రక్రియల్లో మహిళల పాత్ర, వారి సాధికారత సాధికారత లభిస్తుంది” అని ఆయన తెలిపారు. ఇందులో సైద్ధాంతికంగా ఏమీ లేదని, మహిళలు శాంతి పరిరక్షణలో పాల్గొనడం వాస్తవికత అని చెప్పారు. అందుకే శాంతి పరిరక్షణలో ఎక్కువ మంది మహిళలు ఉండేలా తమ ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నామని అని అన్నారు.
సీనియర్ మహిళా జనరల్స్ దరఖాస్తు
సభ్య దేశాల వనరులు అంత ఎక్కువగా లేనందున ఐక్యరాజ్య సమింతి శాంతి పరిరక్షక దళాలు ఇప్పటికీ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆయన అన్నారు. ఫోర్స్ కమాండర్, డిప్యూటీ ఫోర్స్ కమాండర్ పదవులకు మరింత మంది సీనియర్ మహిళా జనరల్స్ దరఖాస్తు చేసుకోవాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు. ఇది పురోగతిలో ఉన్న పనిగా వర్ణించారు. ఫిబ్రవరి 24-25 తేదీల్లో భారత్ నిర్వహించిన మహిళా శాంతి పరిరక్షకుల కోసం మొట్టమొదటి సమావేశంలో పాల్గొనడానికి ఆయన దిల్లీని సందర్శించారు. శాంతి, భద్రతను ముందుకు తీసుకెళ్లడంలో మహిళలు పోషించే కీలక పాత్రను చర్చించడానికి గ్లోబల్ సౌత్ 35 దళాలను భారత్ ఒకచోట చేర్చింది. రక్షణ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కేంద్రం (సీయూఎన్పికె) సహకారంతో విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించింది.
Read Also: Harverd: హార్వర్డ్ యూనివర్సిటీ ట్రంప్ ఆంక్షలపై కోర్టు స్టే పొడిగింపు