భారత్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ పాకిస్థాన్ (Pakistan) కు ఆర్థిక సాయం చేసేందుకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఆమోదం తెలిపింది. తక్షణమే బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు అంగీకరించింది. ఈ విషయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఐఎంఎఫ్ (IMF) ఆమోదించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Shahbaz Sharif) కార్యలయం వెల్లడించింది.
పాకిస్థాన్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ యత్నం
పహల్గాం (Pahalgam) దాడి తర్వాత పాకిస్థాన్పై ఒత్తిడి పెంచేందుకు భారత్ అన్ని మార్గాలపై దృష్టిపెట్టింది. పాకిస్థాన్కు ఐఎంఎఫ్ అందించే బెయిల్ ఔట్ ప్యాకేజీపై (Bailout pakage) ఆందోళన వ్యక్తం చేసింది. ఆ రుణాన్ని పాకిస్థాన్ ఉగ్రవాదానికి నిధులను సమకూర్చేందుకు వినియోగిస్తోందని ఆరోపించింది. పాకిస్థాన్కు రుణానికి సంబంధించి శుక్రవారం ఐఎంఎఫ్ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐఎంఎఫ్ సాయం చేసేందుకు పూర్తిగా వ్యతిరేకించింది. ఓటింగ్కు కూడా భారత్ దూరంగా ఉంది. అయినప్పటికీ పాక్కు రుణసాయం అందించేందుకు ఐఎంఎఫ్ అంగీకరించింది. మరోవైపు పాకిస్థాన్కు ప్రపంచబ్యాంకు ఇచ్చే రుణంపై పునఃసమీక్ష చేయాలన్న భారత్ విజ్ఞప్తి చేసిందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఈ మేరకు ప్రపంచబ్యాంక్ సమీక్ష చేసినట్లు పేర్కొంది.

భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్
పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. దీంతో భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికే పాక్ సుమారు 8.8 బిలియన్ డాలర్లు బాకీ పడింది. అలాగే ఐఎంఎఫ్కు పాక్ నాలుగో అతిపెద్ద రుణగ్రహీతగా ఉంది. యుద్ధ వాతావరణం, ప్రతికూల పరిస్థితుల వల్ల పాక్ స్టాక్ మార్కెట్ సూచీలు కుప్పకూలుతున్నాయి. భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. పాకిస్థాన్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్ కరాచీ- 100 ఏప్రిల్ 23 నుంచి 7,500 పాయింట్లకు పైగా కోల్పోయింది.
Read Also: Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లో చిక్కుకున్న తమిళ విద్యార్థులు.. రంగంలోకి స్టాలిన్ ప్రభుత్వం !