हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్

చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

Vanipushpa
చేజారిన గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో వ్యాపారాలను నిర్వహిస్తున్న వ్యాపారవేత్త గౌతమ్ అదానీ. అనూహ్యంగా ఆయనను టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ తన వ్యాపార కార్యకలాపాలను క్లోజ్ చేయగా.. ఇటీవల అమెరికా ప్రభుత్వం చేపడుతున్న దర్యాప్తు చేస్తున్న లంచాల కేసుకు సంబంధించిన చట్టాన్ని ట్రంప్ రద్దు చేశారు. ఈ క్రమంలో అదానీ గ్రూప్ నేతృత్వంలోని అదానీ గ్రీన్ ఎనర్జీ కంపెనీ శ్రీలంక కేంద్రంగా చేపట్టాలని గతంలో నిర్ణయించిన రెండు పవర్ ప్రాజెక్టుల నుంచి తప్పుకుంది. ఇదే విషయాన్ని కంపెనీ శ్రీలంక ప్రభుత్వ సంస్థకు తాజాగా పంపిన లేఖలో వెల్లడించింది. ఈ నిర్ణయంతో కంపెనీ ఏకంగా బిలియన్ డాలర్ల విలువైన విండ్ ఎనర్జీ ప్రాజెక్టు నుంచి పక్కకు తప్పుకోవటం గమనార్హం. పర్యావరణ అనుమతుల్లో జాప్యం, సుప్రీంకోర్టులో ప్రాజెక్టుపై కేసు వంటి కారణాలతో ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది.

చేజారిన  గౌతమ్ అదానీ రూ.8,500 కోట్ల ప్రాజెక్ట్

గౌరవపూర్వకంగా తప్పుకోవాలని..
అయితే ఈ ప్రాజెక్టు రద్దును నివారించటానికి ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను తిరిగి చర్చించడానికి మరో క్యాబినెట్ నియమించిన చర్చల కమిటీ, ప్రాజెక్ట్ కమిటీ ఏర్పాటు చేయబడతాయని అదానీ గ్రీన్ ఎనర్జీ ఒక ప్రకటనలో పేర్కొంది. లంక సార్వభౌమ హక్కులను గౌరవిస్తూ.. ప్రాజెక్టు నుంచి గౌరవపూర్వకంగా తప్పుకోవాలని నిర్ణయించినట్లు అదానీ గ్రూప్ వెల్లడించింది.

ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ దాదాపుగా 5 మిలియన్ డాలర్లను ఖర్చు

దీని కింద గతంలో కుదుర్చుకున్న ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, విండ్ ఎనర్జీ ప్రాజెక్టుల నిర్మాణం ముందుకు కదలక మునుపే శ్రీలంకలో నిలిచిపోనున్నాయని తెలుస్తోంది. దాదాపు అన్ని అనుమతులు పొందటం చివరి దశలో ఉన్న తరుణంలో కంపెనీ ప్రాజెక్టు నుంచి వెనక్కి తగ్గాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ దాదాపుగా 5 మిలియన్ డాలర్లను ఖర్చు కూడా చేసింది. గతంలో జరిగిన ఒప్పందం కింద అదానీ గ్రూప్ శ్రీలంక ఇంధన మౌలిక సదుపాయాలకు మద్దతుగా 220 KV, 400 KV పవర్ ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణతో పాటు, మన్నార్ పూనెరిన్‌లలో 484 మెగావాట్ల విండ్ ఎనర్జీ కేంద్రాలను స్థాపించాల్సి ఉంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ మన్నార్ ప్రాంతంలో పర్యావరణ అనుమతుల్లో జాప్య, హైకోర్టులో కొనసాగుతున్న కేసుతో ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని అదానీ నిర్ణయించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870