పొరుగుదేశం ఆఫ్ఘనిస్తాన్(Afghanistan)లో భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. సరిహద్దు ప్రాంతం కావడం వల్ల పాకిస్తాన్(Pakistan)లోనూ తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. దీనివల్ల ప్రాణ నష్టం చోటు చేసుకున్నట్లు సమాచారం లేదు. కొన్ని చోట్ల ఆస్తినష్టం సంభవించింది. పలు నివాసాలు బీటలు వారాయి. కొన్ని పాక్షికంగా కూలిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్(Afghanistan) లో నాలుగు రోజుల్లో భూమి ప్రకంపించడం ఇది నాలుగోసారి. ఆ దేశ ఉత్తరప్రాంతం(Northside)లోనే ఈ నాలుగు భూకంపాలు నమోదు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

రిక్టర్ స్కేలుపై 4.2గా నమోదు
తాజా భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.2గా రికార్డయింది. ఈ ఉదయం సరిగ్గా 8:54 నిమిషాలకు 36.41 నార్త్ అక్షాంశం, 70.94 తూర్పు రేఖాంశం పరిధిలోకి వచ్చే ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర ప్రాంతం బఘ్లాన్ ప్రావిన్స్లో భూమి కంపించింది. ఉపరితలం నుంచి 140 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్స్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించినట్లు నేషనల్ సెస్మాలజీ సెంటర్ వెల్లడించింది. భూకంపం సంభవించిన వెంటనే స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లల్లో నుంచి బయటికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తరువాత కూడా స్వల్ప స్థాయిలో ప్రకంపనలు సంభవించడం వల్ల ఇళ్లల్లోకి వెళ్లడానికి వెనుకాడారు. చాలా సేపటి వరకు రోడ్ల మీదే గడిపారు.
తరచూ భూమి ప్రకంపిస్తున్నది
భారత్ చుట్టూ ఉన్న పాకిస్తాన్, చైనాతో ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మధ్యకాలంలో తరచూ భూమి ప్రకోపిస్తోండటం చర్చనీయాంశమౌతోంది. నిజానికి- భూకంపాలు సంభవించే అవకాశం అత్యధికంగా ఉండే దేశాలతో కూడిన రింగ్ ఆఫ్ ఫైర్లో ఆఫ్ఘనిస్తాన్ లేదు. అయినప్పటికీ- ఈ మధ్యకాలంలో ఇక్కడ తరచూ భూమి ప్రకంపిస్తోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంటుంది ఆఫ్ఘన్. కెనడా, అమెరికా, మెక్సికో, గ్వాటెమాలా, కోస్టారికా, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా, రష్యా, జపాన్, ఫిలిప్పీన్స్, ఇండొనేసియా, పపువా న్యూగినియా, న్యూజిలాండ్.. రింగ్ ఆఫ్ ఫైర్ దేశాలు. 2023 అక్టోబర్లో ఆఫ్ఘనిస్తాన్ పశ్చిమ ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపంలో అంచనాలకు మించి ప్రాణ, ఆస్తినష్టం సంభవించిన విషయం తెలిసిందే. హెరాత్ సిటీలో భూమి ప్రకోపించిన ఘటనలో 1,500 మంది వరకు మరణించారు.
Read Also: Indian Army: పాక్ క్షిపణులను ధ్వంసం చేసిన భారత ఆర్మీ..వీడియో విడుదల