భారత్(India)కు ఇటీవల అరుదైన లోహాల దిగుమతులు ఆపేసి షాకిచ్చింది పొరుగు దేశం చైనా(China). అరుదైన ఎర్త్ మాగ్నెట్(earth magnet)దిగుమతులలపై ఆంక్షలు విధించింది. దీంతో సప్లయ్ చైన్కు అంతరాయం కలుగుతోందని నిపుణులు చెబుతున్నారు. చైనా ఆంక్షలు భారత్తో పాటు ప్రపంచ దేశాలను ప్రభావితం చేయనున్నాయి. అయితే తాజాగా చైనా(China) మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండు నెలలుగా భారతదేశానికి ప్రత్యేక ఎరువుల దిగుమతులను నిలిపివేసింది చైనా. ఈ ఎరువులు.. పండ్లు, కూరగాయలు, ఇతర పంటల దిగుబడిని పెంచడానికి విరివిగా ఉపయోగిస్తారు.

భారత్కు దిగుమతులు నిలిపివేసి..
వ్యవసాయ ఉత్పత్తులను సరఫరా చేసే దేశాల్లో కీలకంగా ఉన్న చైనా.. భారత్కు దిగుమతులు నిలిపివేసి.. ఇతర దేశాలకు సరఫరా చేస్తూనే ఉండటం గమనార్హం. భారత్ తన అవసరాల కోసం దాదాపు 80% ఎరువులను చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. “గత నాలుగు నుంచి ఐదు సంవత్సరాలుగా చైనా ప్రత్యేక ఎరువుల సరఫరాను భారత్కు తగ్గిస్తూ వస్తోంది. ఈసారి మాత్రం పూర్తిగా నిలిపివేసింది.” అని సోల్యుబుల్ ఫెర్టిలైజర్ ఇండస్ట్రీ అసోసియేషన్ (SFIA) అధ్యక్షుడు రాజీబ్ చక్రబర్తి తెలిపారు. ఇదిలా ఉండగా.. చైనా, భారత్ మధ్య సరిహద్దు వివాదాలు, పాకిస్తాన్కు మద్దతు వంటి కారణాల వల్ల డ్రాగన్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల భారతదేశంలో పంట దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
గత ఐదేళ్లలో సరిహద్దు వివాదాలు పెరిగాయి
అయితే చైనా ప్రభుత్వం భారత్కు ఎగుమతులను నిలిపివేయడానికి వివిధ విధానాలను ఉపయోగిస్తోంది. “ఫ్యాక్టరీల నుంచి బయటకు వెళ్లే ప్రతి వస్తువును చైనా తనిఖీ చేస్తుంది. భారత్కు పంపాల్సిన సరుకులను తనిఖీ చేయడం లేదు. ఎటువంటి బహిరంగ నిషేధం విధించకుండానే ఎగుమతులను నిరోధించడానికి వివిధ విధానాలను ఉపయోగిస్తున్నారు” అని ఈ విషయం గురించి తెలిసిన వ్యక్తులు తెలిపారు.
భారత్తో సరిహద్దు పంచుకుంటున్న దేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు అనుమతి తప్పనిసరి చేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికి ప్రతిస్పందనగా చైనా ఈ చర్యలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఇరు దేశాల మధ్య గత ఐదేళ్లలో సరిహద్దు వివాదాలు పెరిగాయి. ఇక.. పాకిస్తాన్కు డ్రాగన్ మద్దతు ఇవ్వడం కూడా ఉద్రిక్తతలను పెంచింది.
ఎందుకోసం ఈ ఎరువులు అవసరం
అధిక-నాణ్యత గల పంటల పెరుగుదల దశల్లో వాటి ప్రత్యేక అవసరాలను తీర్చడం, దిగుబడిని పెంచేందుకు ఉపయోగపడతాయి. అంతేకాకుండా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం. కంట్రోల్డ్ లిలీజ్ మెకానిజంల ద్వారా పోషకాల వినియోగ సామర్థ్యాన్ని పెంచుతాయి. పర్యావరణ సంబంధిత ఆందోళనలకు కూడా పరిష్కారంగా ఉంటాయి.
భారతదేశం సాధారణంగా జూన్-డిసెంబర్ కాలంలో 150,000 నుంచి 160,000 టన్నుల ప్రత్యేక ఎరువులను దిగుమతి చేసుకుంటుంది. ప్రస్తుతం చైనా ఎగుమతులను నిలిపివేయడంతో పత్యామ్నాయ మార్గాల్లో దిగుమతి చేసుకోవాలి. ఇక భారత్ ముందున్న దారి.. పశ్చిమ ఆసియా లేదా యూరప్ నుంచి ఎరువులు దిగుమతి చేసుకోవడం. స్థానికంగా ఈ రకమైన ఎరువుల ఉత్పత్తిని పెంచడానికి దీర్ఘకాలిక ప్రోత్సాహకాలు అందించడం.
Read Also: Trump: ఇరాన్పై ట్రంప్ ప్రశంసల జల్లులు