हिन्दी | Epaper
రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు

America: రెండు రోజుల్లో భారత్ పై అమెరికా వైఖరి ఎందుకు మారిపోయింది?

Vanipushpa
America: రెండు రోజుల్లో భారత్ పై అమెరికా వైఖరి ఎందుకు మారిపోయింది?

భారత్ – పాకిస్తాన్(Bharath-Pakistan) ఘర్షణ తర్వాత, ఎవరిది పైచేయి? ఎవరేం సాధించారు? అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్(Donald TrumP ప్రకటనలకు అర్థం ఏమిటి? అనే అంశాలపై పెద్దయెత్తున చర్చ నడుస్తోంది. కాల్పుల విరమణను భారత్, పాకిస్తాన్(Bharath-Pakistan) ప్రకటించడానికంటే ముందే, ఇరుదేశాలూ కాల్పుల విరమణకు అంగీకారానికి వచ్చాయని, త్వరలోనే చర్చలు జరుగుతాయని డోనల్డ్ ట్రంప్ సోషల్ మీడియా(Social Media) వేదికగా ప్రకటించారు. తాము జోక్యం చేసుకుని, ఇరుదేశాలనూ కాల్పుల విరమణపై ఒక అంగీకారానికి తీసుకొచ్చినట్లు చాలా సందర్భాల్లో ట్రంప్, ఆయన యంత్రాంగం చెబుతూ వచ్చింది. దీనికి పాకిస్తాన్ బహిరంగంగానే అమెరికాకు కృతజ్ఞతలు తెలిపింది.

America: రెండు రోజుల్లో భారత్ పై అమెరికా వైఖరి ఎందుకు మారిపోయింది?
America: రెండు రోజుల్లో భారత్ పై అమెరికా వైఖరి ఎందుకు మారిపోయింది?

ఇది భారత్ – పాకిస్తాన్ మధ్య సమస్య
కానీ, భారత్ ప్రతిసారీ ఇది భారత్ – పాకిస్తాన్ మధ్య సమస్యని పదేపదే చెబుతోంది. ఈ కాల్పుల విరమణ శాశ్వత ముగింపుకు సంకేతం కాదని అంటోంది. అంతకుముందు, భారత్ – పాకిస్తాన్ ఘర్షణలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు. అమెరికా ప్రకటలను భారత్ బహిరంగంగా ఎందుకు ఖండించలేదు? మున్ముందు ఈ విషయంలో మధ్యవర్తిత్వ పాత్రను పోషించేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారా? ఎంతకాలం ఈ కాల్పుల విరమణ ఉంటుంది? సింధు జలాల ఒప్పందం నిలిపివేత, వీసా ఆంక్షల వల్ల ప్రభావం ఎంత? కశ్మీర్ అంతర్జాతీయ అంశంగా మారుతోందా? ట్రంప్ చెప్పేదంతా తన ఇమేజ్‌ను పెంచుకునే ప్రయత్నాల్లో భాగమా? వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి.
కాల్పుల విరమణ ఎంతకాలం ఉంటుంది?
పహల్గాం దాడి తర్వాత భారత్ – పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు మే 10తో ముగింపుకు వచ్చినప్పటికీ, ఒక్క ప్రశ్న మాత్రం ఎదురవుతోంది. అదేంటంటే.. ఈ పరిస్థితి ఎంతకాలం కొనసాగుతుంది? ఫోర్స్ మేగజీన్ ఎడిటర్ గజాలా వహాబ్ ఇలా అన్నారు, ”ఇందులో మూడు ప్రధాన అంశాలున్నాయి. వాటిని బట్టి ఇది కొనసాగవచ్చు, లేదా కొనసాగకపోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్‌కు అమెరికా జోక్యం అవసరం, అది జరిగింది. ప్రతి అంశంపైనా భారత్‌తో చర్చించేందుకు సిద్ధంగా ఉంది. అమెరికా జోక్యం పాకిస్తాన్‌కు ప్రయోజనకరం.” ప్రస్తుతమున్న పరిస్థితిని దిగజార్చేలా పాకిస్తాన్ వైపు నుంచి ఎలాంటి చర్యలూ ఉండవని, అలా జరిగితే పాకిస్తాన్ హింసాత్మక మార్గాన్ని ఎంచుకుందన్న ఆరోపణలను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆయన అన్నారు.
పాకిస్తాన్ రెచ్చగొట్టే వరకూ భారత్ ఘర్షణకు దిగదు
”రెండోది, భారత్ తానేం చేయాలనుకున్నానో అందులో విజయం సాధించినట్లు చెప్పింది కాబట్టి, ప్రస్తుతం యథాతథ స్థితిని కొనసాగించేందుకే మొగ్గుచూపుతుంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే వరకూ భారత్ ఘర్షణకు దిగదు” అన్నారు. ”ఇక మూడోది, ప్రస్తుతానికి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేసి, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలన్నదే పాకిస్తాన్ విషయంలో చైనా అభిప్రాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో సహకారం, సైనిక మద్దతు, వనరుల సరఫరా కొనసాగిస్తుంది.” భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా వైఖరి కేవలం 50 గంటల్లోనే మారిపోయింది. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తానని చెప్పుకునేంతగా ఏం జరిగింది? ”ట్రంప్ ప్రభుత్వం విదేశీ వ్యవహారాల విషయంలో మొదట్నుంచి తటస్థంగా ఉండేందుకు ప్రయత్నించింది. తాము అధికారంలోకి వస్తే మిడిల్ ఈస్ట్, యుక్రెయిన్ యుద్ధాలకు త్వరలోనే ముగింపు దొరుకుతుందని చెప్పే ప్రయత్నం చేసింది” అని కింగ్స్ కాలేజీ లండన్ ప్రొఫెసర్ హర్ష్ పంత్ అన్నారు.
ట్రంప్ దృష్టి మొత్తం ఇండియన్ పైనే ఎందుకు
”ఇతర విషయాల్లో జోక్యం చేసుకోవడానికంటే ముందు తమ సొంత సమస్యలను పరిష్కరించుకోవాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ప్రపంచ వ్యవహారాల నుంచి వెనక్కి తగ్గి, తన దృష్టి మొత్తం ఇండియన్, పసిఫిక్ రీజియన్‌పై కేంద్రీకరించాలనుకుంటోంది” అన్నారాయన. భారత్ – పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో అమెరికా మొదట సంప్రదాయ విధానాన్ని అనుసరించిందని, ఎప్పుడైతే పాకిస్తాన్ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా మారిందో.. అప్పుడు వ్యూహం మారిపోయిందని పంత్ చెప్పారు. ”పాకిస్తాన్ వైపు నిలవాలని పాకిస్తాన్ – అమెరికా మధ్య తెరవెనక నిర్ణయమైంది. డీజీఎంవోకి ఫోన్ చేసేంత వరకూ భారత్ వైపు కాల్పుల విరమణ ప్రస్తావన లేదు. అలా సాగిన ప్రక్రియలో, ఘర్షణకు తెరపడింది” అని ప్రొఫెసర్ పంత్ అన్నారు.
కశ్మీర్ అంశం అంతర్జాతీయ సమస్యగా మారుతోందా?
కశ్మీర్ అంశంపై డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం పలు ప్రకటనలు చేసింది. కశ్మీర్ అంశం మరోమారు చర్చకు రావాలని పాకిస్తాన్ కూడా కోరుకుంది. కాబట్టి, కశ్మీర్ అంశం మరోసారి తెరమీదికొచ్చిందా? మాజీ దౌత్యవేత్త వీణా సిక్రి మాట్లాడుతూ, ”అస్సలు కాదు, పహల్గాంలో జరిగిన ఈ దాడి ఉగ్రదాడి అనే విషయం ప్రపంచం ముందుంచాలి. ఆ దాడి ఒక యుద్ధ చర్య. ఈ ఘర్షణ అక్కడి నుంచే మొదలైంది. మే 7న భారత్ చేసింది దానికి ప్రతిస్పందన మాత్రమే” అని అన్నారు. ”2019 అక్టోబర్ 5న ఆర్టికల్ 370 తొలగించినప్పుడే, జమ్మూకశ్మీర్ అంశం ముగిసిపోయింది. ప్రస్తుతం సమస్యంతా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్‌ ఎలా తిరిగొస్తుందనే దానిపైనే. దీనిపై చర్చలకు సిద్ధంగా ఉన్నాం” అని వీణా సిక్రి తెలిపారు.
Read Also: America: శాంతి చర్చలపై రష్యాకు అమెరికా వార్నింగ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

ప్రపంచంలోనే నంబర్ వన్ గా చైనా..పని చేయని ట్రంప్ సుంకాలు

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

OnePlus CEO పీట్ లౌపై అరెస్ట్ వారెంట్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

నిరసనలకు ట్రంప్‌ మద్దతుపై రష్యా ఆందోళన

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

డెన్మార్క్ వైపు మొగ్గు చూపడంపై గ్రీన్‌లాండ్ ప్రధానికి ట్రంప్ వార్నింగ్

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ప్రపంచంలోనే 4వ ఖరీదైన జోహో సీఈఓ విడాకులు

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి!

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

ట్రంప్‌ను ప్రపంచం బహిష్కరణ చేయాలి

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

భారీగా తగ్గిన బియ్యం ధరలు.. కారణమేంటంటే?

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

రష్యాపై ఒత్తిడి పెంచుతున్న ఇరాన్ నిరసనలు: జెలెన్​స్కీ

📢 For Advertisement Booking: 98481 12870