हिन्दी | Epaper
స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

Anusha
High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

ఏపీ హైకోర్టు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు షాకిచ్చింది,రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. పాస్టర్ ప్రవీణ్ కుమార్ మృతి కేసులో సీబీఐ విచారణ కోరుతూ కేఏ పాల్ వేసిన పిల్‌పై హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. పిల్‌పై విచారణ జరిపే ముందు రూ.5 లక్షలు హైకోర్టు రిజిస్ట్రీలో జమ చేయాలని కేఏ పాల్‌ను ఆదేశించింది. డబ్బులు కట్టిన తర్వాతే పిల్‌ను పరిశీలిస్తామని కోర్టు తేల్చి చెప్పింది.ఈ పిల్‌పై విచారణ వేసవి సెలవుల తర్వాత ఉంటుందని తెలిపింది.తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది.పాస్టర్ ప్రవీణ్ కుమార్ మరణంపై సీబీఐ విచారణ జరిపించాలని కేఏ పాల్ హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిల బెంచ్ విచారణ చేస్తోంది. ఇప్పటికే కేఏ పాల్ స్వయంగా వాదనలు వినిపించారు. సీసీటీవీ ఫుటేజీ 3 నెలల్లో డిలీట్ అవుతుందని,కాబట్టి దానిని భద్రపరచాలని పోలీసులకు సూచించాలని కోరారు. ‘సీసీ ఫుటేజ్ డిలీట్ అవుతుందని మీకు ఎవరు చెప్పారు? వాస్తవాలు తెలియకుండా వాదనలు చేయొద్దు’ అని హైకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ పిల్‌ను నిజాయితీగా వేశారని నిరూపించుకోవడానికి రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని కేఏ పాల్‌కు ఏపీ హైకోర్టు ఆదేశించింది.

 High Court: కేఏ పాల్ 5లక్షలు చెల్లించాలని హైకోర్టు ఆజ్ఞ

వాదనలు

ఈ పిల్‌పై ఇప్పటికే ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.పాస్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ పగడాల మరణంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కోర్టు ప్రతివాదులుగా ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సిట్‌ డీఎస్పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. కేఏ పాల్ మాత్రమే కాదు,ప్రవీణ్ పగడాల కేసును సీబీఐకి అప్పగించాలని రాజమహేంద్రవరానికి చెందిన దాడి నాగేశ్వరరావు కూడా హైకోర్టులో మరో పిల్‌ వేశారు. అయితే కేఏ పాల్‌ ‘పార్టీ-ఇన్‌-పర్సన్‌’గా తన పిల్‌పై తానే వాదనలు వినిపిస్తున్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ను హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరించారని,పోలీసులు కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టిస్తున్నారని పాల్ ఆరోపిస్తున్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మార్చి నెలలో రాజమహేంద్రవరం సమీపంలో మరణించిన సంగతి తెలిసిందే,అయితే అది రోడ్డు ప్రమాదమని పోలీసులు క్లారిటీ ఇచ్చారు.ప్రవీణ్‌ మద్యం మత్తులో బైక్ నడిపారని ప్రమాదవశాత్తూ కిందపడి మరణించారన్నారు. అయితే కొందరు మాత్రం పాస్టర్ ప్రవీణ్ పగడాలది హత్య అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు,ఈ క్రమంలోనే కేఏ పాల్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Andhra Pradesh: అన్నదాత సుఖీభవకు కొత్త మార్గదర్శకాలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870