Andhra Pradesh: అన్నదాత సుఖీభవకు కొత్త మార్గదర్శకాలు

Andhra Pradesh: అన్నదాత సుఖీభవకు కొత్త మార్గదర్శకాలు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు ప్రధాన అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనుంది. అమరావతి లో పనుల పైన సీఆర్డీఏ నిర్ణయాల కు కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. అన్నదాత సుఖీభవ తల్లికి వందనం పథకాల అమలు పైన నిర్ణయం తీసుకోవటంతో మార్గదర్శకాల పైన మంత్రివర్గం చర్చించనుంది. ఆపరేషన్ సింధూర్ విజయవంతం చేసిన సైనికులను మంత్రివర్గం అభినందించనుంది. అదే విధంగా మంత్రుల పని తీరు పైన సీఎం చంద్రబాబు మరోసారి దిశా నిర్దేశం చేసే అవకాశం ఉంది.ఏపీ మంత్రివర్గం ఈ రోజు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ సమావేశంలో అమరావతి రీ స్టార్ట్ కార్యక్రమానికి వచ్చిన ప్రధాని మోదికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపనున్నారు. 47 వ సీఆర్డీ ఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల పై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. పలు సంస్థల కు భూ కేటాయింపులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా సూపర్ సిక్స్ పథకాల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ తల్లికి వందనం మార్గదర్శకాల పైన చర్చించి ఆమోద ముద్ర వేయనున్నారు.

Advertisements

ప్రతిపాదన

రైతులకు ప్రతీ ఏటా 20 వేల రూపాయలు ఆర్దిక సాయం అందిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ అమలు దిశగా నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మూడు విడుతలుగా రైతులకు అందించనున్నారు. కౌలు రైతులకు వర్తించేలా నిర్ణయించారు. కేంద్రం పీఎం కిసాన్ కింద మూడు విడతల్లో ఇచ్చే నిధులతో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనున్నారు. కాగా, ఈ పథకం అర్హతల పైన ఇప్పటికే అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించారు. వీటి పైన తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ అన్నదాత సుఖీభవ పథకాన్ని అర్హులైన ప్రతీ రైతుకు అందించాలని నిర్ణయంచారు. ఉద్యానవనం, పట్టు పరిశ్రమలకు సంబంధించిన పంటలు సాగు చేసేవారు కూడా ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు.

 Andhra Pradesh: అన్నదాత సుఖీభవకు కొత్త మార్గదర్శకాలు

నిపుణులు

అన్నదాత సుఖీభవ పథకానికి పది వేలకు పైగా పెన్షన్ పొందేవారు,ప్రభుత్వ ఉద్యోగాలు, పదవుల్లో ఉన్న వారికి పథకం అమలు కాదు. ఆర్దికంగా రైతులకు మద్దతుగా నిలిచేందుకు అమలు చేస్తున్న ఈ పథకంలో ఇంజినీర్లు, డాక్టర్లు, లాయర్లు, ఛార్టర్డ్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్టులు, ఇతర వృత్తి నిపుణులు ఈ పథకానికి అనర్హులు. గతేడాది పన్ను చెల్లించిన వారికి పథకం అమలు కాదు. ఇక, వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్చినా ఈ పథకానికి అనర్హులుగా అధికారులు ప్రతిపాదించారు. వీటి పైన నేటి సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక ఈ నెల 27,28,29 తేదీల్లో జరిగే మహానాడు పైనా అధికారిక అజెండా పూర్తయిన తరువాత చర్చించే ఛాన్స్ ఉంది. మంత్రుల పనితీరు పైనా చంద్రబాబు మరోసారి దిశా నిర్దేశం చేసేందుకు సిద్దమైనట్లు సమాచారం.

Read Also : High Court: లులు మాల్‌‌కు కేటాయించిన భూములపై హైకోర్టు కీలక ఆదేశాలు

Related Posts
చంద్రబాబు ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పిన పవన్
pawan babu

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తుండగా, వైసీపీ సభ్యులు అసెంబ్లీలో అనాగరికంగా ప్రవర్తించి, Read more

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
New pass books in AP from April 1

ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ అమరావతి : ఏపీ రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న Read more

Food adulteration: ఆహార కల్తీలో టాప్‌లో తెలంగాణ,ఆంధ్ర
ఆహార కల్తీలో టాప్‌లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

ఒకవైపు వాతావరణ కాలుష్యం పెరిగిపోయి ప్రజారోగ్యం గాలిలో దీపంగా మారుతున్న తరుణంలో, మరోవైపు ఆహార పదార్థాల్లో కల్తీ ముప్పు తీవ్రంగా పెరుగుతోంది. ఈ రెండు సమస్యల మధ్య Read more

Chandrababu : నేడు బాపట్ల జిల్లాకు సీఎం చంద్రబాబు
టిడిపిని లేకుండా చేయాలనుకున్న వారు కాలగర్భంలో కలిసిపోయారు చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. చినగంజాం మండలంలోని కొత్తగొల్లపాలెంలో ఆయన లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×