మనలో చాలామందికి భోజనం చేసిన వెంటనే కొన్ని పనులు చేయడం అలవాటుగా మారిపోయింది. కానీ ఆ అలవాట్లు మన ఆరోగ్యానికి హానికరంగా మారుతాయి అన్న విషయం చాలామందికి తెలియదు. భోజనం అనంతరం శరీరం జీర్ణక్రియ కోసం శ్రమిస్తుంటే, మనం చేసే కొన్ని పనులు ఆ ప్రక్రియను దెబ్బతీస్తాయి. ఇప్పుడు, భోజనం చేసిన వెంటనే తప్పక నివారించాల్సిన కొన్ని అలవాట్లను తెలుసుకుందాం.
తిన్న వెంటనే నిద్రపోవడం – జీర్ణానికి అడ్డంకి
భోజనం చేసిన వెంటనే బెడ్పై పడుకోవడం చాలా మందికి ఆనందంగా అనిపించినా, ఇది శరీరానికి మంచిది కాదు. నిద్రలోకి వెళ్లినప్పుడు జీర్ణవ్యవస్థ (digestive system)నెమ్మదిస్తుంది, ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవచ్చు. ఈ పరిస్థితిలో గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ, హార్ట్బర్న్ వంటి సమస్యలు తలెత్తుతాయి. కనుక భోజనానికి కనీసం ఒక గంట తర్వాత నిద్రపోవడం ఉత్తమం.
ఎక్కువ నీరు త్రాగడం – జీర్ణ రసాలను నీరాజేస్తుంది
తిన్న వెంటనే ఎక్కువ నీటిని త్రాగడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఎందుకంటే నీరు జీర్ణరసాలను పలచన చేసి ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేయకుండా చేస్తుంది. ఇది అజీర్ణానికి దారితీస్తుంది. కనుక, భోజనం చేసిన 30 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగడం ఉత్తమం.
టీ, కాఫీ తాగడం – పోషకాల గ్రహణం తగ్గిస్తుంది
భోజనం చేసిన వెంటనే టీ (Tea)లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారు చాలా మంది ఉంటారు. కానీ వీటిలో ఉండే కెఫిన్, టానిన్ వంటి పదార్థాలు శరీరానికి ఇనుము వంటి ముఖ్యమైన పోషకాల గ్రహణాన్ని నిరోధిస్తాయి. దీర్ఘకాలంలో ఇది పోషకాహార లోపాలకు దారితీస్తుంది. కనుక భోజనం తర్వాత కనీసం 30–45 నిమిషాల గ్యాప్ ఇచ్చి మాత్రమే టీ లేదా కాఫీ తాగడం మంచిది.
తిన్న వెంటనే నడవడం
తిన్న వెంటనే వాక్ చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది పూర్తిగా నిజం కాదు. తిన్న వెంటనే నడవడం వల్ల జీర్ణ వ్యవస్థపై ఒత్తిడి ఏర్పడుతుంది. నిపుణుల సూచన ప్రకారం, భోజనం తర్వాత కనీసం 10–15 నిమిషాల విరామం తీసుకుని, ఆ తర్వాత చిన్న నడక చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
భోజనం తర్వాత చేయవలసిన మంచి పనులు
ఇప్పుడు తిన్న వెంటనే చేయకూడనివే కాదు, ఏం చేయాలన్నదీ తెలుసుకుందాం.
చిన్న నడక – జీర్ణక్రియకు ఊతమిచ్చే అలవాటు
భోజనం చేసిన 10–15 నిమిషాల తర్వాత ఓ చిన్న నడక చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది మరియు గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను నివారించగలదు.
వజ్రాసనంలో కూర్చోవడం – పాత యోగ పద్ధతిలో శక్తివంతమైన ఉపాయం
వజ్రాసనంలో కూర్చోవడం ద్వారా కడుపు భాగంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. రోజూ భోజనం తర్వాత 5–10 నిమిషాలు ఈ ఆసనంలో కూర్చోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Read hindi news:hindi.vaartha.com
Read also: