Pahalgam Attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న దీపికా, షోయబ్ ఇబ్రహీం

Read Time:  1 min
ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న దీపికా కాకర్‌, షోయబ్ ఇబ్రహీం
ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న దీపికా కాకర్‌, షోయబ్ ఇబ్రహీం
FONT SIZE
GET APP

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు నరమేథం సృష్టించిన ఉగ్రవాదుల నుంచి టెలివిజన్ సెలబ్రిటీ జంట దీపికా కాకర్‌, షోయబ్ ఇబ్రహీం త్రుటిలో తప్పించుకున్నారు. అయితే షోయబ్‌ ఇబ్రహీం పెట్టిన ఓ పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.
అదృష్టవశాత్తు తప్పించుకున్నారు
మంగళవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రవాదులు పెట్రేగిపోయారు. కశ్మీర్‌కు వచ్చిన పర్యటకులే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చాలా మంది తమ ప్రాణాలను అరచేతిలో పట్టుకుని పరుగులు తీసి బయటపడ్డారు. కాగా నటి దీపికా కాకర్‌ తన భర్త షోబయ్‌ ఇబ్రహీంతో కలిసి కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. ఉగ్రదాడి జరిగిన సమయంలో వారు అక్కడే ఉన్నారు. కానీ అదృష్టవశాత్తు తృటిలో తప్పించుకున్నారు.

ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న దీపికా కాకర్‌, షోయబ్ ఇబ్రహీం

అందరూ బాధలో ఉంటే ఆ పోస్టులేంటి?
అయితే దాడి నుంచి తప్పించుకున్న ఆ జంట, “మేమిద్దరం క్షేమంగా ఉన్నాం. మంగళవారం ఉదయమే కశ్మీర్‌ నుంచి బయలుదేరి, సురక్షితంగా దిల్లీకి చేరుకున్నాం. అభిమానులు ఎవరూ ఆందోళన పడకండి” అని ఇన్‌స్టా పోస్ట్ పెట్టారు. అక్కడితో ఆగకుండా తమ కశ్మీర్ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. పోనీ అక్కడితో ఆగారా అంటే అదీ లేదు. సోయబ్‌ ఇబ్రహీం కశ్మీర్‌లోని అందమైన ప్రదేశాలతో వ్లాగ్ చేసినట్లు పేర్కొన్నాడు. త్వరలోనే దానిని విడుదల చేస్తామని పేర్కొన్నాడు.
దీనితో అప్పటి వరకు దీపికా కాకర్‌కు ఏమైందని ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఉగ్రవాదుల దాడిలో చాలామంది పర్యటకులు ప్రాణాలు కోల్పోతే, మీరు మాత్రం కశ్మీర్ అందాలను వీడియో తీసి, దానిని ప్రచారం చేసుకుంటున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తీవ్రంగా విమర్శిస్తూ కామెంట్లు పెడుతున్నారు.

Read Also: Saifulla Sajid Jutt: పహల్గామ్‌ దాడికి సూత్రధారి సైఫుల్లా సాజిద్ జుట్?

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.