Former Vice President Hamid Ansari who exercised the right to vote at home

ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి హమీద్‌ అన్సారీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొబైల్‌ పోస్టల్‌ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకుని ఆయన ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లకు పైబడిన వృద్ధులు, వికలాంగులు ఇంటి నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఇంటి నుంచి ఓటు వేయాలనుకున్న అర్హులైన వృద్ధులు, వికలాంగులు దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల సిబ్బందే సదరు ఓటరు ఇంటికి వెళ్లి ఓటు వేయించుకుంటారు.

Advertisements

పోలింగ్‌కు ముందే ఈ ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రక్రియు పూర్తిచేస్తారు. ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ జిల్లాలోని ఎన్నికల కార్యాలయం కూడా జిల్లాలో ఇంటి నుంచి ఓటు వేసే సౌకర్యం కల్పించింది. ఈ సౌకర్యాన్ని మాజీ ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ ఉపయోగించుకున్నారు. మొబైల్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఆయన సోమవారం ఉదయం ఓటు వేశారు. అన్సారీ ఓటు హక్కు వినియోగించుకున్న ఫొటోలను న్యూఢిల్లీ జిల్లా ఎన్నికల కార్యాలయం విడుదల చేసింది.

ఇక, వచ్చే నెల (ఫిబ్రవరి) 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. 8న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధికార ఆప్‌, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మధ్య త్రిముఖ పోరు నెలకొంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ హవా కొనసాగింది. ఆ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. బీజేపీకి 2015లో మూడు, 2020లో 8 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి.

Related Posts
Nara Lokesh : రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్
Nara Lokesh రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్

Nara Lokesh : రోడ్డు విస్తరణ పై నేడు శంకుస్థాపన చేసిన నారా లోకేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ తన Read more

Group-1 Results : గ్రూప్1 లో రాష్ట్రస్థాయి 124వ ర్యాంకు సాధించిన నల్గొండ యువకుడు
Group-1 Results : గ్రూప్1 లో రాష్ట్రస్థాయి 124వ ర్యాంకు సాధించిన నల్గొండ యువకుడు

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం దుబ్బతండా గ్రామంలో తేజావత్‌ అశోక్ ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టాడు. అతని తల్లిదండ్రులు, తేజావత్‌ బూరి మరియు లక్ష్మణ్‌ రెండెకరాల Read more

విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్
విదేశీ మహిళా పై కర్ణాటక లో గ్యాంగ్ రేప్

భారత పర్యటనలో భాగంగా కర్ణాటక రాష్ట్రానికి వచ్చిన ఇజ్రాయెల్ పౌరురాలు దారుణమైన సంఘటనకు గురైంది. ఈ పర్యటనలో భాగంగా, ఆమెకు ఆశ్రయం ఇచ్చిన అతిథి గృహం యజమానురాలితో Read more

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త
TTD Tickets

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త . ఏప్రిల్ నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ. 300) టోకెన్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విడుదల చేసింది. Read more

Advertisements
×