ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- 16మంది నక్సల్ హతం!

Chhattisgarh: ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్-16మంది నక్సల్ హతం!

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 16 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. 16మంది నక్సలైట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్- 16మంది నక్సల్ హతం!

ఇరువర్గాల మధ్య కాల్పులు
స్థానిక గోగుండా కొండపై మావోయిస్టుల కదలికలు ఉన్నాయన్న సమాచారంతో శుక్రవారం పోలీసులు కూంబింగ్‌ నిర్వహించారు. శనివారం ఉదయం కూడా సెర్చ్ ఆపరేషన్​ కొసాగుతుండగా కెర్లపాల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు కాల్పులకు దిగారు. ఈ క్రమంలోనే ఎదురుకాల్పులు జరిపిన పోలీసులు 16 మందిని హతమార్చారు. డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌గార్డ్‌ (DRG), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (CRPF) బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఇరువర్గాల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి.
ఈ ఏడాదిలోనే జరిగిన మూడో భారీ ఆపరేషన్
2026 నాటికి మావోయిస్టులు లేని దేశంగా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా ప్రకటించిన తర్వాతే ఛత్తీస్​గఢ్​లో యాంటీ నక్సలిజం ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ప్రభుత్వ దళాలు చేపట్టిన ఆపరేషన్​లో దాదాపు 100మందికిపైగా నక్సల్స్ మరణించారు. ఇక తాజాగా ఎన్​కౌంటర్​ ఈ ఏడాదిలోనే జరిగిన మూడో భారీ ఆపరేషన్. మార్చిన 20న బీజాపూర్ జిల్లా ఇంద్రావతి నేషనల్ పార్క్ అడవుల్లో జరిగిన ఎన్​కౌంటర్​లో ఏకంగా 30 మంది మావోయిస్టులు హతమయ్యారు.

Related Posts
Drugs:హోలీ ముసుగు స్వీట్స్ లో గంజాయి సరఫరా
Ganja:హోలీ ముసుగు స్వీట్స్ లో గంజాయి సరఫరా

దేశమంతా హోలీ సంబురాలు ఘనంగా జరిగాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా రంగుల పండుగను ఎంజాయ్ చేశారు. ముఖ్యంగాహైదరాబాద్ నగరంలో హోలీ వేడుకలు వైభవంగా సాగాయి. గల్లీ Read more

ఫిబ్రవరి 16 నాటికి ఢిల్లీ సీఎం ఎంపిక !
Selection of Delhi CM by February 16!

ప్రధాని స్వదేశానికి చేరుకున్న తర్వాతే సీఎం ఎంపిక. ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి. న్యూఢల్లీ : ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఐదు రోజులైనా Read more

ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్
ఈనెల 15 నుంచి యుపిఐ కొత్త రూల్స్

ప్రస్తుతం మన దేశంలో డిజిటల్ పేమెంట్లు రికార్డ్ స్థాయిలో జరుగుతున్నాయి. అందులో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) అధికంగా ఉంటున్నాయి. స్మార్ట్ ఫోన్ ఉన్న వారిలో దాదాపు Read more

ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్ ప్రారంభం
flipkart

ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకు భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందించే ‘రిపబ్లిక్ డే సేల్‌ 2025’ను ప్రారంభించింది. జనవరి 14న (మంగళవారం) ప్రారంభమై 6 Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *