Dust storm in Delhi disrupts flight operations

Delhi Airport : ఢిల్లీలో దుమ్ము తుపాను.. విమాన రాకపోకలకు అంతరాయం

Delhi Airport : దేశరాజధాని ఢిల్లీ విమానాశ్రయంలో శుక్రవారం ప్రతీకూల వాతావరణం కారణంగా పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అక్కడ ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు. పలువురు విమాన ప్రయాణికులు ఎక్స్ వేదికగా తమ ఆవేదనను వ్యక్తంచేశారు.

Advertisements
ఢిల్లీలో దుమ్ము తుపాను విమాన

దాదాపు 15 విమానాలను దారి మళ్లింపు

ఢిల్లీలొని కొన్ని ప్రాంతాల్లో దుమ్ము తుపానుతో పాటు మోస్తారు వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం బలమైన ఈదురుగాలులు వీచాయి. దీని కారణంగా కొన్నిచోట్ల చెట్టు కొమ్మలు విరిగిపడ్డాయి. ఈక్రమంలోనే బలమైన ఈదురుగాలులు వీయడంతో దాదాపు 15 విమానాలను దారి మళ్లించినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఎయిరిండియా, ఇండిగో విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. విమానాల రాకపోకల ఆలస్యం కారణంగా ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాదాపు 12 గంటలుగా విమానాశ్రయంలోనే వేచి చూసినట్లు ఒక మహిళ పేర్కొన్నారు.

పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆవేదన

ముంబయికి వెళ్లేందుకు ఢిల్లీ విమానాశ్రయానికి వచ్చాం. ఉదయం 12 గంటలకు బుక్‌ చేసుకున్న విమానం కాకుండా మరొకటి ఎక్కాలని అధికారులు సూచించారు. అదికాస్త ఎక్కాక అందులోనే 4 గంటల పాటు కూర్చోబెట్టి తర్వాత దింపేశారు.అని ఒక ప్రయాణికుడు వార్తా సంస్థతో తెలిపారు. ఇక, పలువురు ప్రయాణికులు ఎక్స్ వేదికగా ఆవేదనను వ్యక్తంచేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం అయి ఉండి సరైన సమాచారం ఇవ్వకపోవడంపై ఒక ప్రయాణికుడు ఆగ్రహం వ్యక్తంచేశారు.

Read Also: గీతాంజలి ఎక్స్ ప్రెస్ లో ఘటన

Related Posts
Simhadri Appanna Kalyanam : రేపు సింహాద్రి అప్పన్న కళ్యాణం
Simhadri Appanna Kalyanam2

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవం రేపు అంగరంగ వైభవంగా జరగనుంది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ ఏకాదశి Read more

Chandrababu: తిరుమలలో భక్తుల సౌకర్యాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
తిరుమల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు సమీక్ష

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలలో పూర్తిస్థాయిలో మార్పులు కనిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో టీటీడీపై నిర్వహించిన సమీక్షలో Read more

గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది – కేటీఆర్
గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది - కేటీఆర్

తెలంగాణ మాజీ మంత్రి కె. తారక రామారావు (కేటీఆర్) కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేస్తోంది - కేటీఆర్. Read more

ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు..
Lokayukta notice to Chief Minister Siddaramaiah

బెంగళూరు: మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) కుంభకోణం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే సిద్ధ రామయ్యకు లోకాయుక్త నోటీసులు Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×