ఆదిలాబాద్(Adilabad) జిల్లా గుడిహత్నూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. స్నేహం ముసుగులో ఓ బాలుడు మైనర్ అమ్మాయిని వేధింపులకు గురి చేశాడు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడాలని ఒత్తడి తేవటంతో పాటు.. దాన్ని రికార్డ్(Video) చేసి తన స్నేహితులకు పంపాడు. స్థానికంగా వీడియో వైరల్ కావటంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను బెదిరించి ఆమె నగ్న వీడియోలను రికార్డు చేసి ఇతరులకు పంపిన కేసులో ఇద్దరు మైనర్లతో సహా ఆరుగురిపై పోక్సో (POCSO) కేసు నమోదైంది. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశారు.

పోలీసుల చర్యలు – ఎనిమిది మందిపై కేసు నమోదు
ఏఎస్పీ కాజల్ సింగ్(ASP Kajal Singh) వెల్లడించిన వివరాల ప్రకారం.. గుడిహత్నూర్(gudihathnoor) మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికకు సోషల్ మీడియా ద్వారా ఒక బాలుడు (16) పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఆ బాలుడు బాలికను నగ్నంగా వీడియో కాల్ చేయమని బెదిరించాడు. అలా చేయకపోతే వారి చాటింగ్ను బాలిక తల్లిదండ్రులకు చూపిస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. బాలిక నగ్న వీడియోను రికార్డు చేసిన ఆ బాలుడు.. ఆ వీడియోను తన స్నేహితులకు షేర్ చేశాడు. ఈ వీడియోలు స్థానికంగా వైరల్ అయ్యాయి. దీంతో సదరు బాధితురాలు మానసిక ఆవేదన గురైంది. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.
తల్లిదండ్రులకు పోలీసుల సూచన – పిల్లలపై ఆన్లైన్ పర్యవేక్షణ తప్పనిసరి
తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించగా.. గుడిహత్నూర్ పోలీస్స్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. షీ టీమ్ బృందం సహాయంతో గుడిహత్నూర్, ఇచ్చోడ పోలీసులు సీఐ రాజు ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో మందిపై పోక్సో కేసు నమోదు చేశారు. ఇద్దరు మైనర్లు సహా.. వంశీకృష్ణ, పవర్ తరుణ్, సాబ్లె బాలవంత్ సింగ్, గుండల్వార్ వరుణ్, కారడ్ సుధీర్, ముర్కుటే విఠల్ అనే వ్యక్తులపై కేసు నమోదు చేసారు. నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరచగా.. ఇద్దరు మైనర్ బాలురను నిజామాబాద్లోని జువైనల్ హోంకు తరలించారు. మిగిలిన మేజర్లను రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి వేధింపులు ఎదురైతే వెంటనే పోలీసులను సంప్రదించాలని అధికారులు సూచించారు. ఈ సంఘటన ద్వారా సమాజం సైబర్ భద్రత, బాలల రక్షణపై మరింత సూక్ష్మమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. POCSO చట్టం కఠినంగా అమలు కావడం ఈ ఘటనలో ముఖ్యమైందని స్పష్టమవుతోంది. అలాంటి దుశ్చర్యలకు గురైతే, జాప్యం లేకుండా పోలీసులను సంప్రదించాలి అని అధికారులు సూచించారు.
Read Also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం