हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ

Vanipushpa
పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ

పల్లి గింజ ఏడాదిన్నర పసివాడి ప్రాణం తీసింది. మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలం నాయక్‌పల్లిలో ఆదివారం ఈ విషాదం చోటుచేసుకుంది. గూడూరు ఎస్సై గిరిధర్ రెడ్డి కథనం ప్రకారం గుండెల వీరన్న, కల్పన దంపతులకు కుమారుడు అక్షయ్ శివ ప్రేమ్‌కుమార్‌ ఉన్నాడు. ఈ నెల 7న ఆటాడుకుంటూ ఇంట్లో ఉన్న పల్లి గింజను మింగాడు. పొరబోయి బాలుడు దగ్గుతుండగా గమనించిన తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఎక్స్‌రే తీయించగా పల్లి గింజ గొంతులో కాకుండా ఊపితిత్తుల్లోకి చేరిందని గుర్తించారు.

పసివాడి ప్రాణాన్ని తీసిన పల్లి గింజ

చికిత్స పొందుతూ మరణించాడు

రెండు రోజులుగా ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్వాస ఆడక ఆదివారం ఉదయం మరణించాడు. ఇద్దరు కుమార్తెల తర్వాత మూడో సంతానంగా కుమారుడు జన్మించడంతో ఎంతో సంతోషించిన ఆ కుటుంబం, కళ్లెదుటే పసివాడి మరణంతో తల్లడిల్లిపోయింది. తల్లిదండ్రుల రోదనలు అక్కడున్న వారి హృదయాలను కలిచివేశాయి. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై గిరిధర్ రెడ్డి తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870