📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ ఈ వారం వైల్డ్ ఫైర్ నామినేషన్స్ స్టేజ్ మీద ముద్ద మందారం 2 సీరియల్ సందడి ‘ఆదిత్య 999’ బాలకృష్ణ క్రేజీ అప్‌డేట్ సౌత్ సినిమాలకు నెట్‌ఫ్లిక్స్ గట్టి షాక్ ‘రాజు వెడ్స్ రాంబాయి’ టికెట్ ధర..₹99 మాత్రమే! సినిమాలకి తులసి గుడ్ బై 71వ ఎపిసోడ్‌లో వాడి వేడి నామినేషన్ లు

Mahesh Babu: ఏప్రిల్ 26న ఒక్కడు, భరత్ అనే నేను మూవీ రీ రిలీజ్

Author Icon By Anusha
Updated: April 18, 2025 • 4:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన రీ రిలీజ్ హంగామా కనిపిస్తుంది.టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో భారీ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చివరిగా బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోని ‘గుంటూరు కారం’ చిత్రంతో థియేటర్లలో సందడి చేశారు.అయితే నెక్ట్స్ జక్కన్న డైరెక్షన్ లో నటిస్తున్న ఎస్ఎస్ఎమ్ బి 29 చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందో పక్కాగా తెలియని పరిస్థితి. ఇక మహేశ్ బాబును మళ్లీ థియేటర్లలో చూడాలంటే అభిమానులు చాలా కాలం ఆగాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఈ క్రమంలోఅభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎస్ఎస్ఎంబీ29 కంటే ముందే థియేటర్లలో సందడి చేయబోతున్నారు. మహేశ్ బాబు కెరీయర్ లోని హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’, అలాగే సూపర్ హిట్ ఫిల్మ్ ‘బిజినెస్ మ్యాన్’ చిత్రాలు రీరిలీజ్ అయ్యి థియేటర్లలో సందడి చేసిన సంగతి తెలిసిందే. రీ రిలీజ్ ల్లోనూ ఈ చిత్రాలు మంచి వసూళ్లను రాబట్టాయి.

విడుదల

మరికొద్ది నెలల్లో మహేశ్ బాబు పుట్టిన రోజు ఉన్నందున ముందేగానే రీరిలీజ్ ల పర్వం కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏకంగా మహేశ్ బాబు కెరీర్ లో మంచి విజయాన్ని సాధించిన 4 చిత్రాలను రీ రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. తాజాగా ఆ రీరిలీజ్ సినిమాలకు సంబంధించిన విడుదల తేదీలను కూడా ఫిక్స్ చేశారు. కాగా మొదట మహేశ్ బాబు గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఒక్కడు’ రీ రిలీజ్ కాబోతోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 26న విడుదల చేయబోతున్నారు.అదే రోజు న ఏప్రిల్ 26ననే మహేశ్ బాబు మరో బ్లాక్ బాస్టర్ చిత్రం ‘భరత్ అనే నేను’ చిత్రం కూడా రీ రిలీజ్ కాబోతుండటం విశేషం. ఇలా ఒకే రోజు రెండు చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ థియేటర్లలో దుమ్ములేపోతున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే రీ రిలీజ్ కు సంబంధించిన ఏర్పాట్లలో ఉన్నారు.

రీరిలీజ్

ఆగస్టు 9న మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా బాబు కెరీయర్ లో ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ ‘అతడు’ చిత్రం రీ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఏడాది మహేశ్ బాబు అభిమానులు బ్యాక్ టు బ్యాక్ రీరిలీజ్ లతో ఫుల్ ఎంటర్ టైన్ లభించనుంది. బాబును థియేటర్లలో చూసుకునే అవకాశం ఇలా దక్కడం విశేషం. ఇదిలా ఉంటే మహేశ్ బాబు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్ లో ఎస్ఎస్ఎంబీ29 చిత్రం శరవేగంగా రూపుదిద్దుకుంటోంది. నెక్ట్స్ షెడ్యూల్ ఇటలీలో జరగనుంది. 3000 మంది ఆర్టిస్టులతో భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేయబోతున్నారట.

Read Also: Thaman: నా ఫస్ట్ రెమ్యూనరేషన్ రూ.౩౦ రూపాయలు: థమన్

#MaheshBabu #MaheshBabuBirthdaySpecial #Okkadu #OkkaduReRelease #SuperstarMaheshBabu #Tollywood Ap News in Telugu Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.