ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్లో ఒకరిగా వెలుగొందుతున్నఎస్.థమన్ ఓవైపు చార్ట్ బస్టర్ సాంగ్స్ కంపోజ్ చేస్తూనే, మరోవైపు అదిరిపోయే బిజీఎం ఇవ్వడం తమన్ ప్రత్యేకత. అందుకే కాపీ క్యాట్ అంటూ ఎంతగా విమర్శలు వచ్చినా సరే, ఆయన డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం అతని చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే తాజాగా తన తొలి పారితోషికం వివరాలను వెల్లడించారు.లేటెస్టుగా యాంకర్ సుమ నిర్వహిస్తున్న చిట్ చాట్ షోలో గెస్టుగా పాల్గొన్నారు. తన సినీ కెరీర్, పర్సనల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమాతో తన సినీ ప్రయాణం మొదలైందని, అప్పుడు తనకు 11 సంవత్సరాలు అని చెప్పారు. ఈ చిత్రానికి గాను తాను ఫస్ట్ సాలరీగా కేవలం రూ.30 మాత్రమే అందుకున్నట్లు థమన్ తెలిపారు.
బాలు, శివమణి రెండు కళ్ళు
4 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే నేను డ్రమ్స్ ప్లే చేయటం స్టార్ట్ చేశాను. 8 – 9 ఏళ్ల వయసున్నప్పుడే నేను నా ప్రొఫెషన్ మొదలుపెట్టాను. బర్త్ డే పార్టీలకు వెళ్లి డ్రమ్స్ వాయించే వాడిని. వాళ్లు నాకు 10 – 25 రూపాయలు ఇచ్చేవారు. పదకొండు ఏళ్ల వయసులో ‘భైరవ ద్వీపం’ సినిమాకి వర్క్ చేశాను. ఫస్ట్ డే నాకు రూ.30 ఇచ్చారు. కొత్త పది రూపాయల నోట్లు మూడు ఇచ్చారు. అప్పట్లో పేమెంట్స్ అప్పటికప్పుడు చేతికి ఇచ్చేవారు. దాదాపు తొమ్మిది రోజులు ఆ సినిమాకి పని చేశాను. అలా 1994లో ఆ సినిమాకి నేను రూ.270 సంపాదించా” అని థమన్ చెప్పారు.తన తండ్రి చనిపోయినప్పుడు ఆయన్ను చూడడానికి ఇండస్ట్రీ నుంచి చాలా తక్కువ మందే వచ్చారని, శివమణి అయ్యప్పమాల తీసేసి మరీ వచ్చారని థమన్ తెలిపారు. తండ్రి చనిపోయిన క్షణంలో తనకు ఏడుపే రాలేదని, తల్లిని చెల్లిని ఎలా చూసుకోవాలి అనే దాని గురించే ఆలోచించానని, కానీ శివమణిని చూడగానే ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశానని అన్నారు. శివమణి, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో కలిసి దాదాపు 7 వేల స్టేజ్ షోలు చేశామని చెప్పారు. బాలు, శివమణి తనకు రెండు కళ్లని తమన్ పేర్కొన్నారు.

మ్యూజిక్ కంపోజ్
ప్రస్తుతం థమన్ పవన్ కళ్యాణ్ ఓజి, ప్రభాస్ ‘ది రాజాసాబ్’, నందమూరి బాలకృష్ణ ‘అఖండ 2’ సినిమాలకు సంగీతం సమకూరుస్తున్నారు. సిద్ధూ జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ మూవీ చేస్తున్నారు. అలానే ‘ఇదయం మురళి’ అనే తమిళ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయడమే కాదు, యాక్టర్ గా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ‘ఫైర్ స్టార్మ్’ అనే పాటను శింబు పాడినట్లు తెలిపారు.
Read Also: Dia Mirza: కాఫిర్ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన దియా మిర్జా