వారసుడిని నిర్ణయించే అధికారం తనకు మాత్రమే ఉందంటూ బౌద్ధ మత గురువు దలైలామ(Dalai Lama) చేసిన వ్యాఖ్యలపై చైనా(China) స్పందించింది. దలైలామా(Dalai Lama) వారసుడికి కచ్చితంగా తమ ఆమోదముద్ర ఉండాల్సిందేనని చైనా(China) పేర్కొంది. వారసుడి గుర్తింపు కార్యక్రమాన్ని చైనాలోనే పురాతన విధానాలను అనుసరించి నిర్వహించాలని చైనా విదేశాంగశాఖ ప్రతినిధి మావోనింగ్ మీడియా సమావేశంలో తెలిపారు.
కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి
‘వారసుడి ఎంపిక ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ అనుమతికి లోబడి ఉండాలి. 18వ శతాబ్దపు క్వింగ్ రాజవంశం ప్రారంభించిన ‘గోల్డెన్ అర్న్’ పద్ధతిని అనుసరించాల్సిందేనని మావో నింగ్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 14వ దలైలామా కూడా సంప్రదాయాలకు అనుగుణంగా ఎంపికైనప్పటికీ, అప్పటి కేంద్ర ప్రభుత్వం గోల్డెన్ అర్న్ ప్రక్రియ నుంచి మినహాయింపు ఇచ్చింది. 2007లో గోల్డెన్ అర్న్ విధానాన్ని చైనా చట్టబద్ధం చేసింది. దీనిలో విదేశీ వ్యక్తులు లేదా సంస్థలు జోక్యం చేసుకోకూడదనే నిబంధన ఉంటుంది’ అని మావోనింగ్ అన్నారు. అయితే, మావోనింగ్ దలైలామా వ్యాఖ్యలకు ఇచ్చిన స్పందన చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార వెబ్సైట్లో ప్రచురితమైన ట్రాన్స్క్రిప్ట్లో లేకపోవడం గమనార్హం.

వారసుల ఎంపిక ప్రక్రియ కూడా చైనా చట్టాలు ఆధారంగా జరగాలి
లివింగ్ బుద్ధా పునర్జన్మ ఆచారం 700 సంవత్సరాలకు పైగా కొనసాగుతోందని భారత్లోని చైనా రాయబారి సూఫెహాంగ్ అన్నారు. ‘దలైలామ కూడా మతపరమైన ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూనే ఎంపికయ్యారు. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛ విధానాన్ని అమలు చేస్తోంది.
సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన దలైలామా
15వ దలైలామా ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని, దానిని నిర్వహించే అధికారం గాడెన్ ఫోడ్రోంగ్ ట్రస్ట్కు మాత్రమే ఉందని సోషల్ మీడియాలో దలైలామా పోస్టు పెట్టారు. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు తమదేనని చైనా వాదిస్తోంది. దీనితో తన వారసుడి ఎంపిక గురించి దలైలామా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తాను మరణించిన తర్వాతే తన వారసుడు వస్తారని స్పష్టం చేశారు. 2015లో ఈ ట్రస్ట్ను దలైలామా ఏర్పాటు చేశారు. 2011 సెప్టెంబర్ 24నే తాను టిబెట్ బౌద్ధ మత పెద్దలు, నాయకులు, ఇతర సంస్థలతో భేటీ నిర్వహించి తన వారసుడి ఎంపిక కొనసాగించాలా? అనే అంశంపై అభిప్రాయాలు కోరినట్లు పేర్కొన్నారు. దీనికి అన్నివర్గాల నుంచి సానుకూల స్పందనలు వచ్చాయన్నారు.
Read Also: Donald Trump : ఎలాన్ మస్క్ను ‘‘డోజ్’ రాకాసి తినేస్తుంది!’: ట్రంప్