chennai flood

వరదలతో చెన్నై అతలాకుతలం..

చెన్నై నగరాన్ని భారీ వర్షాలు , వరదలు వదలడం లేదు. ప్రతి ఏటా ఇలాంటి వర్షాలు , వరదలకు అలవాటుపడిపోయిన జనాలు చిన్న వర్షం పడగానే ముందుగానే పెద్ద జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బంగాళఖాతంలో ఉపరితల ద్రోణి, అల్పపీడనం, వాయుగుండం ప్రభావంతో తమిళనాట భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు రాజధాని చెన్నైలోని వేలచేరిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వేలాది ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. అయితే ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంతో ఇప్పటివరకు అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో చెన్నైలో ఇప్పటికే 11 సబ్ వేలు మూసివేశారు. అటు సహాయ చర్యలు అందించేందుకు ప్రభుత్వం ఇప్పటికే 16 వేల మంది వాలంటీర్లను సిద్ధం చేసింది. చెన్నైలో 980 పునరావస కేంద్రాలు ఏర్పాటు చేసింది.

Advertisements

ఎప్పుడు వర్షాలు పడినా చెన్నై నగరం చెరువైపోతోంది. వాతావరణ మార్పులతో ఏటా తుఫాన్ల ప్రభావం పెరుగుతోంది. 1943లో మొదలైన వరదల తాకిడి ఇప్పటివరకు కంటిన్యూ అవుతోంది. చెన్నై వరదలకు ప్రకృతి విపత్తుకంటే మానవ తప్పిదాలే ప్రధాన కారణం. చెన్నైలో మొత్తం 6 అటవీ ప్రాంతాలు ఉన్నాయి. 3 నదులు, 5 తడి నేలలు ఉన్నాయి. అయితే, ఈ ఎకో సిస్టమ్ క్రమంగా దెబ్బతింటూ వచ్చింది. తడి నేలలు, నదుల విస్తీర్ణం తగ్గిపోయింది.

నగరం భౌగోలిక పరిస్థితులు కూడా వరద ముప్పునకు కారణం అవుతున్నాయి. సముద్ర మట్టానికి చాలా ప్రాంతాలకు కేవలం 2 మీటర్ల ఎత్తులోనే ఉన్నాయి. వరదలు రాగానే ఈ ప్రాంతాలన్నీ నీట మునిగిపోతున్నాయి. ఈ క్రమంలో చెన్నై వరదలు తమిళనాడు వాళ్లకే కాకుండా, హైదరాబాద్ వాళ్లకు డిస్కషన్ పాయింట్ అయ్యింది. హైడ్రా (Hydra)పై కొంత మంది పోస్టులు చేస్తున్నారు. చెన్నైలో మాదిరిగా హైదరాబాద్ వాసులు ఇబ్బంది పడకూడదంటే నాలాలు, మూసీ నది వెంట ఆక్రమణలు తొలగించాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Related Posts
జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష తేదీలు ఖరారు
JEE Main exams

దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఇంజినీరింగ్ అభ్యర్థులు ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ (JEE Main) తుది విడత పరీక్షల తేదీలను ఎన్టీఏ (NTA – నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) Read more

హైదరాబాద్‌లో బీజేపీ-కాంగ్రెస్ ఘర్షణ
హైదరాబాద్‌లో బీజేపీ-కాంగ్రెస్ ఘర్షణ

ప్రియాంక గాంధీపై బీజేపీ మాజీ ఎంపీ రమేష్ బిధూరి చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంగళవారం నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద Read more

New brand: అందుబాటులోకి మద్యం కొత్త బ్రాండ్
New brand: అందుబాటులోకి మద్యం కొత్త బ్రాండ్

మద్యం ప్రియులకు పండుగ వాతావరణం తెలుగు రాష్ట్రాల్లో మద్యం ప్రియులకు ఇది పండుగ వాతావరణమే. 2024-25లో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో నమోదవడంతో, ఈ ఏడాది ఆ Read more

దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
jayachandran singer dies

ప్రఖ్యాత గాయకుడు పి జయచంద్రన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 80 సంవత్సరాల వయసులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన Read more

×