మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu : మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

Chandrababu Naidu : మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మద్రాస్ ఐఐటీలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐఐటీ విద్యార్థిని సృజన తన సందేహాన్ని సీఎం చంద్రబాబుకు వ్యక్తం చేసింది.సృజన తనను తాను తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన అమ్మాయిగా పరిచయం చేసుకుని, ప్రతీ ఇంట్లో టెక్నాలజీ అభివృద్ధి చెందాలి, ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్) నేర్చుకోవాలి అన్నారు కదా.అయితే ఏఐ వంటి ఆధునిక సాంకేతికతలను మరింత అభివృద్ధి చేసేందుకు విద్యావ్యవస్థను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఐఐటీలను మీరు ఇందులో ఎలా భాగస్వాములను చేస్తారు? అని ప్రశ్నించింది.ఆమె ప్రశ్నను శ్రద్ధగా విన్న చంద్రబాబు, సృజనను చూశారు.నువ్వు ఎప్పుడు పుట్టావమ్మా?” అని ప్రశ్నించారు.సృజన 1997లో పుట్టానని సమాధానం చెప్పింది.

Advertisements
మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
Chandrababu Naidu మద్రాస్ ఐఐటీ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

దీనిపై చంద్రబాబు చిరునవ్వుతో, నువ్వు పుట్టడానికి రెండేళ్ల ముందే నేను ముఖ్యమంత్రిని అయ్యాను. నీది ఏ జిల్లా? అని అడిగారు. “కరీంనగర్,” అని ఆమె చెప్పగానే చంద్రబాబు తన ప్రసంగాన్ని కొనసాగించారు.నువ్వు హైదరాబాద్ అభివృద్ధిని చూసి ఉంటావు కదా. ఎంతగా ఎదిగిందో తెలుసు. నిజమైన అభివృద్ధి ఆలోచనల వల్ల జరుగుతుంది. వాటిని ఆచరణలో పెట్టడం ముఖ్యం. భవిష్యత్తు పూర్తిగా క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా ఉంటుంది. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐటీ గురించి పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే దీని ప్రాముఖ్యతను గుర్తించాను. ఇప్పుడు అదే విధంగా, క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి చెప్పడానికి ఎక్కువమందికి అవగాహన లేదు.ప్రస్తుతం భారతదేశంలో 68% మంది ఏఐను ఉపయోగిస్తున్నారు.అంతేగాక హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారో గూగుల్ అంకుల్‌ను అడగండి!

ఏఐ సాయంతో సమాధానం వెంటనే వస్తుంది.చాలామంది తెలిసో తెలియకో ఏఐని ఉపయోగిస్తున్నారు.కానీ నిజమైన శక్తి రియల్ డేటాలో ఉంటుంది.సరైన డేటా ఉంటే, ఏమైనా సాధ్యమే.ఇప్పుడంతా సెన్సార్ల సాయంతో ఎన్నో పనులు చక్కబెట్టుకుంటున్నాం.ఉదాహరణకు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని సెన్సార్లు చెబుతాయి.దాని ఆధారంగా మనం సరైన ఆహారపు అలవాట్లను పాటించవచ్చు.ఉదాహరణగా నా వేలికి ఉన్న రింగ్‌ను చూడండి.ఇది పూజారి ఇచ్చిన ఉంగరం కాదు.ఏ మూఢ నమ్మకాల కోసం ధరించిన వస్తువు కాదు.ఇది ఒక మానిటరింగ్ డివైస్.నేను ఉదయం లేవగానే నా శరీరం ఎంతగా సంసిద్ధంగా ఉందో ఈ రింగ్ తెలియజేస్తుంది.నిద్ర నాణ్యత గుండె వేగం వంటి అనేక ఆరోగ్య సంబంధిత వివరాలను ఇది నిరంతరం నిశితంగా పర్యవేక్షిస్తుంది.ఇలా చంద్రబాబు తన అనుభవాలను పంచుకుంటూ, భవిష్యత్ టెక్నాలజీల ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులకు మార్గదర్శకత్వం ఇవ్వడమే కాకుండా, టెక్నాలజీ ద్వారా అందరూ ఎదగాలని ఆకాంక్షించారు.

Related Posts
గవర్నర్, కేంద్ర మంత్రికి తప్పిన ప్రమాదం
Fire Accident HSAGAR

హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్లో జరిగిన 'భారతమాతకు మహా హారతి' కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. కార్యక్రమం Read more

LPG Rate : ప్రపంచంలో ఎల్పీజీ రేటు భారత్‌లోనే ఎక్కువ !
LPG rates in India are the highest in the world!

LPG Rate : పెరిగిన నిత్యావసరాల ధరలతో ఇప్పటికే సతమతమవుతున్న పేద, మధ్యతరగతి ప్రజల జీవితాలను పెరిగిన గ్యాస్‌, పెట్రోల్‌ ధరలు మరింత కుదేలు చేస్తున్నాయి. 2014లో Read more

రేపట్నుంచే ఒంటిపూట బడులు -టైమింగ్స్ ఇవే
తెలంగాణలో రేపటి నుంచి ఒంటిపూట బడులు – ఏప్రిల్ 1 వరకు అమలు

ఎండల తీవ్రత దృష్ట్యా సాధారణంగా మార్చి 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఒంటి పూట బడులు అమలు చేస్తుంటారు. కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే Read more

Golconda Blue diamond :’ గోల్కొండ బ్లూ’ వజ్రం వేలంపాటకు సన్నాహాలు..
Preparations underway for auction of 'Golconda Blue' diamond

Golconda Blue diamond : భారతీయ రాజుల దగ్గర ఉన్న అరుదైన వజ్రం' గోల్కొండ బ్లూ' ను వేలం వేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఇందౌర్‌, బరోడా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×